Smart Tv: రూ.4999కే 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. ఫీచర్స్ ఇవే?

Smart Tv: టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో మార్కెట్లోకి ఎన్నో రకాల మోడల్స్ తో అద్భుతమైన ఫీచర్స్, డిజైన్స్ కలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు విడుదలైన విషయం తెలిసిందే. అటువంటి వాటిలో స్మార్ట్ టీవీలు కూడా ఒకటి. ఇదివరకు రోజుల్లో స్మార్ట్ టీవీలు అంటే చాలా పెద్దగా వచ్చేది. కానీ రాను రాను స్మార్ట్ టీవీలు కేవలం వేలుపాటి మందంతో కూడా వస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికి ఎన్నో రకాల స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఆయా కంపెనీలు అతి తక్కువ ధరలకు అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి.

 

ఇదిలా ఉంటే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నా వారికి ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే 32 అంగుళాల స్మార్ట్ టీవీ ని కేవలం 5 వేలకే కొనుగోలు చేయవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. వన్ ప్లస్ వై1S 32 అంగుళాల స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 21,999 కాగా ఆఫర్ లో దీనిని 15,999కి కొనుగోలు చేయవచ్చు. మీరు పాత టీవీని కలిగి ఉంటే, మీరు దానిని మార్చుకోవచ్చు. దీని కోసం మీకు రూ.11,000 వరకు ఆఫర్ ఇవ్వబడుతుంది. పూర్తి మార్పిడి విలువను పొందినప్పుడు, మీరు ఈ టీవీని కేవలం రూ. 4,999 కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ నుండి చెల్లింపుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వబడుతుంది. అలాగే, నో కాస్ట్ ఈఎంఐతో నెలకు రూ.2,667 చెల్లించి స్మార్ట్ టీవీను సొంతం చేసుకోవచ్చు.

 

ఇకపోతే ఈ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ టీవీ HD రెడీ LED డిస్ప్లేతో లభించనుంది. అలాగే దీని పిక్సెల్ రిజల్యూషన్ 1366 x 768 గా ఉంది. అదేవిధంగా ఈ టీవీ, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ మద్దతు ఉన్న యాప్‌లతో ఆండ్రాయిడ్‌లో పని చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 1 సంవత్సరం సమగ్ర వారంటీతో వస్తోంది. దీనితో పాటు, ప్యానెల్‌పై 1 సంవత్సరం అదనపు వారంటీ ఇవ్వబడుతుంది. స్మార్ట్ టీవీలో డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ ఇవ్వబడింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -