Cuddalore: ప్రియుడి కోసం బరితెగించిన వివాహిత.. మూడుసార్లు అలా?

Cuddalore: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా వివాహేతర సంబంధాలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వివాహేతర సంబంధాల మోజులో పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నిత్యం ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. భార్యాభర్తలు వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాల చేతులను నాశనం చేసుకొని కుటుంబాలను వీధిపాలు చేసుకుంటున్నారు. తాజాగా అటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా రామనత్తంలోని తాచూర్ గ్రామానికి చెందిన బాలకృష్ణన్,రాధిక దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కాగా బాలకృష్ణన్ అదే ప్రాంతంలోనే దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అదే ప్రాంతానికి చెందిన దినేష్ అనే 23 ఏళ్ళ యువకుడితో రాధికకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండు సంవత్సరాలుగా వీరి మధ్య అక్రమ సంబంధం సజావుగానే సాగింది. అదీకాక ఈ రెండేళ్లలో రాధిక దినేష్ లు మూడుసార్లు లేచిపోయారు.

 

అప్పుడు బాలకృష్ణన్ పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో రాధికకు కౌన్సిలింగ్ ఇచ్చి బాలకృష్ణ వద్దకు చేర్చారు. అయితే తాజాగా ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. బాలకృష్ణన్ తాజాగా ఇంట్లో శవమై కనిపించాడు.
ఇక బాలకృష్ణన్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు డైరెక్ట్ గా రాధికను తమ స్టైల్లో విచారించగా నేరం అంగీకరించింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతోనే బాలకృష్ణన్ ను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దాంతో రాధికను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక బాలకృష్ణ మరణం, రాధిక అరెస్ట్ తో ఇద్దరు కుమారులు అనాధలుగా మారారు.

Related Articles

ట్రేండింగ్

Giddi Eswari: పాడేరు టికెట్‌‌ గిడ్డి ఈశ్వరికే ఎందుకు.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Giddi Eswari:  ఎన్నికలకు పెద్దగా సమయం లేదు కానీ చంద్రబాబు నాయుడు చివరి క్షణంలో కూడా అభ్యర్థులను స్థాన మార్పిడి చేస్తూ అనూహ్యంగా కొత్తవారికి కూడా టికెట్లు కేటాయిస్తూ ఉన్నారు. ఇలా పలుచోట్ల...
- Advertisement -
- Advertisement -