Samsung: ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ వారం ఓ ఫోన్ లాంచ్ ఐతే.. మరోవారంలో ఇంకోఫోన్ లాంచ్ అవుతోంది. వివిధ కంపెనీలు కొత్తకొత్త ఫచర్లను అందుబాటులోకి తీసుకోస్తున్నాయి.ఎవరైనా కొత్త ఫోన్ కొనాలకున్నప్పుడు ఫస్ట్ ఆలోచించే రెండే రెండు ప్రశ్నలు.. మొదటగా ఫోన్ ప్రాసెసర్ ఎంత ఉంది.. ఆ తర్వాత కెమెరా ఎంత ఉంది.. క్లరిటీ ఎంత తదితరలను పరిగణలోకి తీసుకొని ఫోన్ కొనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన ఫోన్ల దారా పెద్దపెద్ద కార్యక్రమాలను కూడా ఫోన్లలోనే షూట్ చేసుకుంటున్నారు.
మన దైనందిన జీవితంలో ఎక్కడికి వెళ్లినా మనతో ఉండేది ఈ స్మార్ట్ ఫోనే ఇలాంటి అద్భుతమైన ప్రాసెసర్ తో పాటు 200 మెగాపిక్సల్ కెమెరాతో శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ మార్కెట్లో అడుగు పెట్టనుంది . శాంసంగ్ గెలాక్సీ నుంచి అదిరే ఫీచర్లలతో కొత్త ఫోన్ రానుందని ప్రముఖ కొరియా ఐటీ వార్తా సంస్థ వెల్లడించింది. రానున్న కొత్త ఫోన్లో 200ఎంపీ కెమెరా ఉండనున్నట్లు పేర్కొంది.
200ఎంపీ కెమెరాతో మార్కెట్లోకి వస్తే మొదటి మొబైల్ ఇదే అవుతోంది. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4, శాంసంగ్ గెలాక్సీ జెడ్ 4 పోల్డ్ ఫోల్డబుల్ ఫోన్లను ఈ నెల 16న మార్కెట్లో రంగప్రవేశం చేసింది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరి చూపు గెలాక్సీ మోడల్పైనే పడుతోంది. అంతేకాక రానున్న ఏడాదిలో మార్కెట్లోకి గెలాక్సీ ఎస్–23 ఫోన్లో 200ఎంపీ కెమెరాతో పాటు ఎన్నెన్నో ఫీచర్లు ఉంటాయని సదరు సంస్థ వెల్లడించింది.
అంచనా ఇలా..
6.8 ఇంచెస్ డిస్ప్లే తో పాటు
3088 ణ 1440 పిక్సెల్ రిజల్యూషన్ ఉంటుంది.
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ –8
200 ఎంపీ కెమెరా + 8ఓ వీడియో రికార్డర్
ఫ్రంట్ ఫింగర్ప్రింట్ సెన్సార్
ఆండ్రాయిడ్ 13, ఓఎస్– 5
5,000M్చజి బ్యాటరీ ఉండనున్నట్లు సంస్థ పేర్కొంది.