Chennai: చున్నీ వేసుకోని అమ్మాయిలతో అలా ప్రవర్తిస్తున్న యువకుడు.. ఏమైందంటే?

Chennai: దేశవ్యాప్తంగా స్త్రీలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు మానసిక వేధింపులు హత్యలు మాత్రం ఆగడం లేదు.. ప్రభుత్వం కామాంధుల ఆగడాల కోసం ఎన్ని రకాలు చట్టాలను తీసుకొచ్చినప్పటికీ వారికి సరైన అడ్డుకట్ట వేయలేకపోతోంది. దీంతో కామాంధులు మరింత రెచ్చిఅవుతున్నారు. అయితే కాలం మారిన కూడా ఆడవాళ్లను అర్థం చేసుకునే విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. ముఖ్యంగా వేసుకునే దుస్తుల విషయంలో వారికి తరచుగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.


తాజాగా, ఓ కీచకుడు దుపట్టా వేసుకోని మహిళల పై వేధింపులకు తెగబడ్డాడు. ఒకరు కాదు. ఇద్దరు కాదు ఏకంగా 75 మంది మహిళల్ని అతడు వేధించాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు లోని చెన్నైకి బగీర్‌ దుపట్టా వేసుకోని మహిళలపై కక్ష గట్టాడు. దుపట్టా లేకుండా కనిపించిన ఆడవాళ్ల పై వేధింపులకు దిగటం మొదలుపెట్టాడు. అలా చెన్నైలోని అన్నానగర్‌, జేజే నగర్‌, తిరుమంగళం, పెరవల్లూర్‌ ప్రాంతాల్లో దుపట్టా లేకుండా కనిపించిన ఆడవాళ్లపై లైంగిక వేధింపులకు దిగాడు.

 

ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం తిరుమంగళం ఏరియాలో ఒక 17 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బగీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణలో అతడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఒంటరిగా కనిపించిన వాళ్లను మాత్రమే తాను వేధిస్తానని తెలిపాడు. దుపట్టా లేకుండా తిరిగే ఆడవాళ్లు నగ్నంగా ఉన్నట్లేనని అతడు తెలిపాడు. అందుకే వారిని వేధించినట్లు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -