Rakul: నటి రకుల్ కు డ్రగ్స్ కేసులో నోటీసులు.. ఏమైందంటే?

Rakul: గత కొన్ని రోజులుగా ఈడీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. పొలిటీషియన్స్ దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకూ కూడా ఈడీ ఎదుట హాజరవుతూ ఉన్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో హాట్ అండ్ స్వీట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీసులు అందజేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు నోటీసులను జారీ చేసింది.

హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ కు నోటిసులిచ్చిన ఈడీ అధికారులు ఆమెను డిసెంబర్ 19వ తేదిన విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఈ కేసులో మరికొందర్ని కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. బెంగుళూరు డ్రగ్స్ కేసులో తాండూరు ఎమ్మెల్యే అయిన పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా శుక్రవారం ఈడీ అధికారులు నోటీసులు అందించారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే చాలా మంది హీరోయిలను, పలువురు సెలబ్రిటీలను, కీలక వ్యక్తులను, రాజకీయ నాయకులను సైతం ఈడీ విచారించింది. తాజాగా ఈడీ విచారణకు హాజరు కావాలని రకుల్ ప్రీత్ సింగ్ కు నోటిసులివ్వడంతో మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ కేసులో రకుల్ ఉందనే విషయం తెలియడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది. డ్రగ్ డీలర్లతో బ్యాంకు ట్రాన్షేషన్లపై రకుల్ తో అధికారులు విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. డ్రగ్స్ డీలింగ్ తో సంబంధమున్న వ్యక్తులకు డబ్బులు పంపినట్లు ఆమెపై పలు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పైలెట్ రోహిత్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్ లకు ఈడీ నోటీసులు జారీ చేశారని, దీనిపై ముమ్మరంగా విచారణ సాగే అవకాశం ఉందని సమాచారం.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -