Actress: నటనకు గుడ్ బై చెప్పబోతున్న నటి.. ఎందుకో తెలుసా?

Actress: ఇండస్ట్రీలో చాలామంది నటీమణులు పెళ్లి అయిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతుండగా మరికొందరు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలకు దూరం అవుతున్నారు. కేవలం వెండి తెర నటిమణులే కాకుండా బుల్లితెర నటీమణులు కూడా ఈ విధంగా పెళ్లి తర్వాత ఇండస్ట్రీలకు దూరమవుతున్నారు. తాజాగా కూడా ఒక బుల్లితెర నటనకు గుడ్ బై చెప్పి అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఆమె మరెవరో కాదు హిందీ బిగ్ బాస్ సీజన్ 12 విజేత, ప్రముఖ బుల్లితెర నటి అయిన దీపికా కక్కర్.

ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కావడంతో తన కుటుంబానికి, పుట్టబోయే బిడ్డకు కోసం తగినంత సమయాన్ని కేటాయించడం కోసం నటనకు గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. కాగా బుల్లితెర నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపికా కక్కర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందు మొదట జెట్ ఎయిర్ వేస్ సంస్థలో ఎయిర్ హూస్టెస్ గా మూడేళ్లు పనిచేసింది. ఆ తరువాత అనారోగ్యం కారణంతో ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసింది. తర్వాత మోడల్ గా కెరీర్ ప్రారంభించి దానితోపాటు యాక్టింగ్ కెరీర్ పై దృష్టి పెట్టింది. అలా బాలీవుడ్ పాపులర్ సీరియల్ ససురాల్ సిమర్ కా సీరియల్ తో నటిగా దీపికా కక్కర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

ఆ తర్వాత పలు రియాల్టీ షోలలో పాల్గొంది. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కాగా ఈమె తన సహనటుడు షోయబ్ ఇబ్రహీంని ప్రేమించి 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. షోయబ్ ముస్లిం కావడంతో దీపిక కూడా ఆ మతంలోకి మారిపోయింది. ఈ క్రమంలోనే ఆమె తనపేరు ఫైజా గా మార్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా దీపికా మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను గర్భవతిని. తల్లిని కాబోతున్న ఫీలింగ్ ఎంతో సంతోషాన్నిస్తుంది. పెళ్లైన ఐదేళ్ల తర్వాత మేము తల్లిదండ్రులు కాబోతున్నాము. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. చిన్నవయసులోనే నేను కెమెరా ముందు మేకప్ వేసుకున్నాను. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగాను. నా ప్రెగ్నెన్సీ గురించి నా భర్త షోయబ్ కి చెప్పిన తర్వాత ఆయన కళ్లలో ఆనందం వేరే లెవల్. నాకు పనిచేయడం ఇష్టం లేదు. నటనకు గుడ్ బై చెప్పి.. ఒక తల్లిగా, భార్యగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది దీపికా కక్కర్.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత ఇలాకాలోనే జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్.. వందల బస్సులు పెట్టి తరలించినా జనం లేరుగా!

YS Jagan: మనుషులు లేకపోయినా అభివాదం చేయడం.. కష్టంలో ఉన్నవారి దగ్గరకు వెళ్లి అక్కడ కూడా మనస్పూర్తిగా నవ్వడం ఏపీ సీఎం జగన్‌లోనే చూడొచ్చు. ఈ మధ్య ఓ రీల్ బాగా గ్రెండ్...
- Advertisement -
- Advertisement -