ఈమె దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దాదాపు 15 సంవత్సరాలకు ఈమెకు అదృష్టం వరించింది. 2008వ సంవత్సరంలో నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆదాశర్మ పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో ఈమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత క్షణం, గరం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలలో సందడి చేశారు. అయితే ఏ సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈమె సినీ కెరియర్ ముగిసిందని అనుకున్న తరుణంలో ది కేరళ స్టోరీస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈమె సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ సినిమా దక్షిణాది సిని ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి క్రేజ్ ఏర్పడింది.ఇలా 15 సంవత్సరాల కాలంలో తొలి బ్లాక్ బస్టర్ సినిమా అందుకున్నటువంటి ఈమెకు సోషల్ మీడియాలో ఫాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయారు. మరి ఈ సినిమా సక్సెస్ తో ఆదాశర్మ జాతకం మారిపోనుందా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.