Aadipurush: ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విమర్శలు వచ్చాయి. మీమర్స్ అయితే రెచ్చిపోయారు. విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పుట్టించారు. రాజకీయ నేతలు కూడా దీనిపై స్పందించారు. రావణుడి గెటప్ పై అనేక విమర్శలు వచ్చాయి.
ప్రభాస్ చిత్రం యానిమేషన్ ను తలపిస్తోందన్న విమర్శలు జోరుగా వచ్చాయి. దీనిపై హీరో ప్రభాస్.. డైరెక్టర్ ఓం రౌత్ పై సీరియస్ అయినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. విజువల్స్, యానిమేషన్ విషయంలో ఇంకా మార్పులు చేయాలని, కథలోనూ ఇంకా మార్పులు చేర్పులు జరగాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతోందని సమాచారం.
ఆదిపురుష్ చిత్రం ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 12న విడుదల కావాలి. కానీ అలా జరగేందుకు అవకాశం లేదని తాజా సమాచారం. కొన్ని రోజులుగా సినిమా విడుదలపై తీవ్రంగా శ్రమిస్తున్న చిత్ర బృందం.. ఆఖరికి సినిమా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరి నుంచి తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమాను కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లందరికీ ఈ విషయం చేరవేశారని టాక్ నడుస్తోంది.
ఈ వార్త సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. నెల ముందు వరకు ఆదిపురుష్ సినిమా విషయంలో ధీమాగా ఉన్నారు, కానీ టీజర్ రిలీజయ్యాక పరిస్థితి మారిపోయిందని చెబుతున్నారు. నెగిటివ్ కామెంట్స్ తో చిత్ర బృదం అలర్ట్ అయ్యింది. ఓం రౌత్ అండ్ టీం వీఎఫెక్స్, ఇతర విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.