Adipurush: ఆదిపురుష్ సినిమాకు అదిరిపోయే బెనిఫిట్.. ఆ రాయితీ ఇవ్వనున్నారా?

Adipurush: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఇప్పటికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా గత ఏడాది విడుదల అయ్యి ఊహించని విధంగా విమర్శలను ఎదుర్కోవడంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూనే వస్తున్నారు మూవీ మేకర్స్. ఎట్టకేలకు ఈ సినిమా వచ్చే నెల జూన్ లో విడుదల చేయమన్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేశారు… ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ ప్రేక్షకులలో అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నారు.

 

ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా మరికొందరు ఈ సినిమా సక్సెస్ అవడం ఖాయం రాసిపెట్టుకోండి అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఏపీ ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేమిటంటే.. ఆదిపురుష్ మూవీకి కూడా పన్ను మినహాయింపు ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్ మూవీ రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మన భారతీయ ఇతిహాసాన్ని విశ్వవ్యాప్తంగా గ్రాండియర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక ఈ సినిమాకు బీజేపీ అండదండలు ఉన్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది.

 

ఇప్పటికే ఓం రౌత్ భూషణ్ కుమార్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కలిపి మూవీపై చర్చించారు. రాయితీ వల్ల టికెట్ ధరలు తగ్గి సినిమా ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉన్నాయని సినీ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు. జూన్ 16న ఆదిపురుష్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. జూన్ 11న తిరుపతిలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు మూవీ మేకర్స్. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -