Dil Raju: అయ్యో పాపం.. నిర్మాత దిల్ రాజుకు ఇలాంటి పరిస్థితా?

Dil Raju: ఒకే ఒక్క సినిమా రెండు చిత్ర పరిశ్రమల మధ్య వివాదానికి కారణమైంది. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న ‘వరిసు’ సినిమా టాలీవుడ్, కోలీవుడ్ మధ్య కాంట్రవర్సీకి కారణమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా.. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’తో పోటీపడబోతోంది.

 

సంక్రాంతి రిలీజుల విషయలో తెలుగు చిత్రాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న తెలుగు చలనచిత్ర మండలి నిర్ణయంపై తమిళ దర్శక నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తెలుగు నాట ‘వారసుడు’కు అధిక థియేటర్లు ఇవ్వకపోతే.. తమిళనాట టాలీవుడ్ హీరోల చిత్రాల రిలీజులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కూడా కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి.

 

తమిళనాడులో అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో అని.. కాబట్టి ‘తునివు’ కంటే ‘వరిసు’కు అధిక థియేటర్లు కేటాయించాలని దిల్ రాజు అన్నారు. అప్పట్లో ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీనిపై తల అజిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై దిల్ రాజు వివరణ ఇచ్చారు.

 

ఎక్కువ స్క్రీన్లు ఇస్తే బాగుంటుంది: దిల్ రాజు
కోట్లు పెట్టి తీసే సినిమాలను విజయవంతం చేసుకోవాలంటే అన్ని రకాల ప్లాన్లను ఆచరించాల్సి ఉంటుందని దిల్ రాజు అన్నారు. తమిళనాడులో తన సినిమాకు మంచి థియేటర్లు కావాలని అందుకే అడుక్కున్నానని ఆయన చెప్పారు. విజయ్ ‘వరిసు’కు ఎక్కువ స్క్రీన్లు ఇస్తే బాగుంటుందని కామెంట్లు చేశానని స్పష్టం చేశారు. దిల్ రాజు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి, పొంగల్ రేసులో దిగుతున్న ఆయన మూవీ ఎలాంటి హిట్ సాధిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -