Allu Arjun: టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్.. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో సుకుమార్ డైరెక్షన్ తో కలిసి ‘పుష్ప’ సినిమా చేసిన అల్లు అర్జున్.. తిరుగులేని గుర్తింపును, స్టార్ డంను సొంతం చేసుకున్నాడు.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం దగ్గరి నుండి ఆయన డైలాగులు, నటన ఇలా ప్రతి దానికి జనాలు ఫిదా అయిపోయారు. కేవలం దక్షిణాదిలోనే కాదు… హిందీలో కూడా పుష్ప సినిమా సంచలనంగా మారింది. దీంతో ఈ సినిమా క్రేజ్ ఏకంగా ఎల్లలు దాటింది. చాలామంది క్రికెటర్లు కూడా అల్లు అర్జున్ ని ఇమిటేట్ చేశారు.
ఇక తాజాగా ఈ సినిమా గురించి తెగ పొగిడేసిన బాలీవుడ్ హీరోయిన్.. బన్నీ పక్కన ఒక్క ఛాన్స్ దొరికినా వదులుకోను అని చెప్పింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. తెలుగులో మహేష్ బాబుతో కలిసి నెంబర్ వన్ నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా చేసిన కృతి సనన్. బాలీవుడ్ లో హీరోయిన్ గా సాగుతున్న కృతి సనన్.. అప్పుడప్పుడు తెలుగు తెర మీద కనిపిస్తూ ఉంటుంది.
తాజాగా కృతి సనన్ ‘భేడియా’ సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులో ‘తోడేలు’ పేరు మీద డబ్ అవుతోంది. దీని ప్రమోషన్ కోసం అని తెలుగు రాష్ట్రాలకు వచ్చిన కృతి సనన్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా అంటే ఎంతో ఇష్టం అంటూ కామెంట్లు చేసింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన స్టైలిష్ నెస్ చాలా నచ్చుతుందని పేర్కొంది. అయితే బన్నీసినిమాలో ఛాన్స్ కొట్టేయడానికే కృతి సనన్ ఇలా చేస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.