Anasuya: బోరున ఏడ్చిన అనసూయ.. కన్నీళ్లకు కారణం ఇదేనా?

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై వరుస సినిమా అవకాశాలను అందుకుని ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా అవకాశాలతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె తాజాగా నటించిన రంగమార్తాండ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ ప్రకాష్ రాజు బ్రహ్మానందం అనసూయ వంటి వాళ్లు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అనసూయ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఈమె ఒక్కసారిగా మీడియా ఎదుట ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. ఈ క్షణం తనకు చాలా ఎమోషనల్ గా ఉంది. రంగమార్తాండ వంటి ఒక గొప్ప సినిమాలో తాను బాగమయ్యాను. ఈ జీవితానికి ఇది చాలు. ఇక సోమవారం సాయంత్రం ఈ సినిమాని థియేటర్లో ఒక అభిమానిగా చూశాను.అయితే ఈ సినిమాలో నటించాను కనుక అంతగా ఎమోషనల్ కాలేనేమో అని ధైర్యంగా సినిమా చూస్తూ కూర్చున్నాను. అయితే సినిమా చూడగానే కన్నీళ్లు కారిపోయాయని ఈమె తెలిపారు.

 

ఇలాంటి ఒక గొప్ప సినిమాను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని ఈమె తెలిపారు. ఇలా మొదటిసారి అనసూయ మీడియా ముందు ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి ఎప్పుడు ఎంతో ధైర్యంగా అందరిని ఎదిరించి మాట్లాడే అనసూయ ఇలా ఎమోషనల్ అయింది అంటే ఆ సినిమా తనని ఎంతగా కలిసివేసిందో అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -