Anchors: ఈ ఐదుగురు యాంకర్ల భర్తలు ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Anchors: సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఈవెంట్స్ చేయాలనుకున్నా.. యాంకర్లు ఎంతో అవసరం. షోలో ఆడియన్స్ ను ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి యాంకర్స్ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇండస్ట్రీలో మేల్ యాంకర్స్ కంటే.. ఫిమేల్ యాంకర్స్ ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ ఎక్కువగా రాణిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్, పాపులారిటీని సంపాదించుకున్నారు. స్టార్ యాంకర్లుగా ఎదిగి.. బుల్లితెరను ఏలేస్తున్నారు. అయితే చాలా మందికి యాంకర్ల వ్యక్తిగత విషయాలు తెలియదు. అసలు వాళ్ల భర్తలేవరు? వాళ్లేం పనులు చేస్తున్నారో? ఎవరికీ తెలియదు. ఈ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

 

యాంకర్ సుమ..

ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న యాంకర్లలో సుమ ఒక్కరు. ఇప్పటికే పలు టీవీ షోలు, ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే సుమ భర్త రాజీవ్ కనకాల గురించి చాలా మందికి తెలుసు. ఈయన కూడా ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

యాంకర్ అనసూయ..

జబర్దస్త్ యాంకర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది అనసూయ. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా కొనసాగుతోంది. మొన్నటివరకు షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ భామ.. ఇప్పుడు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటోంది. యాంకర్ అనసూయ తన భర్త గురించిన ప్రతీ విషయాలను ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చింది. స్కూల్ ఏజ్‌లో ఎన్‌సీసీకి వెళ్లినప్పుడు రిషి భరద్వాజ్‌ను ప్రేమించింది. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది. అనసూయ భర్త రిషి భరద్వాజ్ బిజినెస్ చేస్తుంటారు.

యాంకర్ ఝాన్సీ..

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ యాంకర్‌గా కొనసాగారు ఝాన్సీ. అప్పట్లో ఎన్నో షోలకు యాంకరింగ్ చేస్తూ.. మంచి గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోల సినిమాలకు యాంకరింగ్ చేయడంతోపాటు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. వ్యక్తిగత విషయానికి వస్తే.. టాలీవుడ్ కమెడియన్ జోగి నాయుడిని పెళ్లి చేసుకుంది. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

 


యాంకర్ ఉదయభాను..

హృదయాంజలి షో ద్వారా కెరీర్ స్టార్ట్ చేసింది ఉదయభాను. తెలుగులో టాప్ యాంకర్‌గా మార్క్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఉదయభాను.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఉదయభాను వ్యక్తిగత విషయానికి వస్తే.. మొదట్లో ఓ వ్యక్తితో వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత విజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతను రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అలాగే ‘సంథింగ్ స్పెషల్’ అనే షో ద్వారా లాస్య యాంకర్‌గా పరిచయం అయింది. మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించిన పెళ్లి చేసుకుంది. లాస్య భర్త సాఫ్ట్ వేర్ ఇంజినీర్.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -