AR Murugadoss: వామ్మో.. 15 నిమిషాల ఎడిటింగ్ కోసం మురుగదాస్ 15 కోట్లు ఖర్చు చేశాడా?

AR Murugadoss: సినీప్రియలకు డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతడు ఇండస్ట్రీలో రైటర్ గా నిర్మాతగా, దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ వేరే ఇతర భాషల్లో దర్శకత్వం వహించి ప్రేక్షకులకు దర్శకుడుగా మరో స్థాయిలో పరిచయం అయ్యాడు. అతనికి బాలీవుడ్ చిత్రం గజని రీమేక్ మరో స్థాయిలో గుర్తింపు సంపాదించి పెట్టింది. ఈ విధంగా ఇండస్ట్రీలో పలు సినిమాలకు ప్రాణం పోసి మురగదాస్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే స్టార్ హీరో సూర్య, మురగదాస్ కాంబినేషన్లో వచ్చిన సెవెంత్ సెన్స్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అంతగా హిట్ దక్కించుకోన్నప్పటికీ.. స్టోరీ పరంగా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టుకుంది. సూర్య ఈ సినిమాలో బోధిధర్మ, మరో పాత్రలో సర్కస్ ఆర్టిస్ట్ గా రెండు పాత్రలు చేశాడు. కాగా ఈ సినిమాలో సూర్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా మెప్పించింది.

సూర్య ఆ సినిమాలో కనబరిచిన నటనకు ఇండస్ట్రీలో చాలామంది దర్శక నిర్మాతలు మరో స్థాయిలో స్టన్ అయ్యారు. అంతేకాకుండా సూర్య గొప్ప నటుడని అప్పట్లో కమల్ హాసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సౌత్ ఇండియాలో కమలహాసన్, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో నటనలో మెప్పించేది సూర్య అని రాజమౌళి తెలిపాడు. అంతేకాకుండా చైనాలో 50 రోజులు ఆడిన మొట్టమొదటి సినిమా గా పేరు తెచ్చుకుంది.

ఆ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సినిమా మొదటి షెడ్యూల్ చైనాలో పూర్తి చేశారట. దీని కోసం మురగదాస్ కేవలం 15 నిమిషాల ఎడిటింగ్ కోసం 15 కోట్లు ఖర్చు చేశారట. ఈ విషయం తెలిసిన సూర్య అభిమానులు మరో స్థాయిలో ఆశ్చర్యపోయారు. ఏదైనా గాని ఈ సినిమా స్టోరీ పరంగా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను కదిలించింది.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -