Chandrababu-Jr NTR: చంద్రబాబు, ఎన్టీఆర్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలబోతున్నారా?

Chandrababu-Jr NTR: రానున్న ఎన్నికలో ఎలాగైనా గెలుపు సాధించాలని అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ పార్టీ నాయకులు జోరుగా ప్రచారాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పలు పార్టీల మధ్య పోరాటం బీభత్సవం గా జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మాత్రం ఎలాగైనా గెలవాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు బాగానే చేసుకున్నాడు.

 

తన కొడుకు నారా లోకేష్ కూడా పాదయాత్ర చేపట్టి ప్రజల అవసరాల గురించి తెలుసుకుంటున్నాడు. మొత్తానికి ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపించాలని కంకణం కట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడానికి తనవంతు ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసారి తను కూడా ముఖ్యమంత్రి కావడానికి బాగా ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో పాటు సిని ప్రముఖులను కూడా రంగంలోకి దింపాడు. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాయం కోరినట్లు తెలిసింది. దీంతో ఎన్టీఆర్ కూడా తన మామ కోరికను తీర్చడానికి రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలవాలని చంద్రబాబు ఎన్టీఆర్ సహాయం కోరగా..

 

వెంటనే ఎన్టీఆర్ పేదలకు మంచి అవకాశాలు కలిపించే విధంగా, ప్రజలకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు అందేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ప్లాన్ తో దెబ్బకు వైసీపీ, జనసేన మూసుకోవాల్సిందేనని కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. అంటే మొత్తానికి చంద్రబాబు, ఎన్టీఆర్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలబోతున్నారని తెలుస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎలాగైనా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవాలని బాగా ఆశిస్తున్నారు. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది అనేది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -