AP Lands: ఆంధ్రప్రదేశ్లో భూములు విలువలను పెంచడానికి ఏపీ సర్కార్ సిద్ధమైందని తెలుస్తుంది.రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి పలు ప్రాంతాలలో భూమి రేట్లు భారీగా పెరిగిపోయాయి కొన్ని ప్రాంతాలలో 30 నుంచి 70% రేట్లు పెరుగగా మరికొన్ని ప్రాంతాలలో 100% భూమి రేట్లు పెరగబోతున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత భూమి రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి భూమి రేట్లు పెరగబోతున్నాయని తెలుస్తుంది.
గతంలో ఏ ప్రాంతాలలో అయితే భూమి రేట్లను పెంచలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతాలలో మాత్రమే భూమి రేట్లను పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో భూముల ధరలు పెంపు వేర్వేరుగా ఉండనున్నాయి. ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కింద 50 గ్రామాలు ఉన్నాయనుకుంటే వాటిలో 20 శాతం గ్రామాల్లో భూముల మార్కెట్ విలువను పెంచుతుంది. ఇక హైవేలో పక్కన ఉన్నటువంటి స్థలాలను మార్కెట్ విలువ ఆధారంగా పరిగణలోకి తీసుకొని పెంచబోతున్నారు.
2020 తర్వాత ఏపీలో మార్కెట్ విలువను పెంచలేదు. స్పెషల్ రివిజన్ పేరిట ఇప్పుడు మార్కెట్ వేల్యూని పెంచుతుంది. బాపట్ల, పల్నాడు, గుంటూరులో మార్కెట్ విలువను పెంచింది ఏపీ ప్రభుత్వం.తాజాగా తీసుకున్న నిర్ణయంతో విశాఖ లాంటి నగరాల్లో భూముల ధరలు అమాంతం పెరగనున్నాయి. విశాఖపట్నంలో విశాఖ, గాజువాక, గోపాలపట్నం, ద్వారకానగర్, పెందుర్తి, భీమిలి, మధురవాడ, ఆనందపురం ఏరియాల్లో ధరలు పెరగనున్నాయి. ఇలా భూముల ధరలు పెరగడంతో
రిజిస్ట్రేషన్ ఎక్కువగా జరిగే ఏరియాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.