Samantha-Naga Chaitanya: సమంత చైతన్య మధ్య అలాంటి సమస్యలు ఉన్నాయా?

Samantha-Naga Chaitanya: టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో సమంత ఒకరు. ఏమాయ చేసావే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్ముడు. ఈ సినిమా విడుదలై 13 ఏళ్ళు అవుతుంది. నాగ చైతన్య హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌గా రూపొందించారు. సిల్వర్ స్క్రీన్ మీద చైతూ-సామ్‌ల కెమిస్ట్రీ అద్భుతం చేసింది. ఇన్నేళ్ల కెరీర్లో అనేక కమర్షియల్ చిత్రాలు చేశారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించారు. వెబ్ సిరీస్లతో డిజిటల్ ప్లాట్ ఫార్మ్‌లో కూడా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో తనను సప్పోర్ట్ చేసిన ప్రేక్షకులకు సమంత కృతజ్ఞతలు తెలిపారు. ఇంస్టాగ్రామ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

 

 

ప్రతి రోజు వేసే ముందడుకు మీ పేమ, అభిమానం వలనే. ఈ ప్రేమ రోజూ నాకు మంచి చేస్తుంది. నన్ను తరచుగా ఇబ్బంది పెట్టే విషయాలు ఇకపై ఏం చేయలేవు. కేవలం ప్రేమ కృతజ్ఞతా భావం ఉంటే చాలు. థాంక్యూ అని ఇంస్టాగ్రామ్‌లో పెట్టారు. మీ ప్రేమాభిమానాలు తోడుంటే నన్ను బాధించే అంశాలు ఏమీ చేయలేవని సమంత అన్నారు. ఇక సమంతను తరచుగా వెంటాడే ఆ బ్యాడ్‌ థింగ్స్ ఏంటనే ఆసక్తి అభిమాన గణంలో కలుగుతుంది.

 

మరోవైపు ఎప్పుడు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే చైతు ఏమాయ చేసావే 13వ యానివర్సరీ మీద స్పందించాడు. సమంతతో కూడిన రొమాంటిక్ పోస్టర్‌ని కూడా షేర్ చేశాడు. దీంతో సమంత మీద ఆయనకు ప్రేమ తగ్గలేదనే ప్రచారం అందుకుంది. విడాకులు తర్వాత ఫస్ట్ టైం సమంతకు సంబంధించిన ఒక విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడు. చైతన్యకు రెండో చిత్రం ఇది. అలాగే ఫస్ట్ హిట్. అన్నింటికీ మించి తన మాజీ భార్య సమంతతో నటించిన చిత్రం.

 

 

2021 అక్టోబర్‌లో సమంత-చైతూ విడాకుల ప్రకటన చేశారు. విడాకులు ప్రకటన అనంతరం సమంత మానసిక వేదన అనుభవించారు. అందులో నుంచి బయటపడేందుకు సమంత ఏకంగా ఆధ్యాత్మిక బాటపట్టారు. ఏది ఏమైనా సమంతను చైతూ జ్ఞాపకాలు వదలడం లేదనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -