Vijayasai Reddy: డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భారీ రిలీఫ్ లభించింది. డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి అన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఆయనకు ఢిల్లీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం విశేషం. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి గత ఏడాది సెప్టెంబర్ మూడో వారంలో శరత్ చంద్రారెడ్డిని ఈడీ మూడు రోజుల పాటు విచారించింది. ఆ తరువాత అనంతరం అదే ఏడాది నవంబర్ రెండో వారంలో మద్యం వ్యాపారి వినయ్ బాబుతో పాటు శరత్ చంద్రారెడ్డిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది.
ఇక ఈ ఏడాది జనవరిలో నానమ్మ మృతి చెందడంతో శరత్ మధ్యంతర బెయిల్పై విడుదల అయ్యారు. 14 రోజుల పాటు ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. తాజాగా తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమె ట్రీట్మెంట్ కోసం రెగ్యులర్ బెయిల్ కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు శరత్ చంద్రారెడ్డి విన్నపంపై సానుకూలంగా స్పందించింది.
శరత్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీంతో శరత్ ఊపిరిపీల్చుకున్నట్టైంది. ఇదే కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్రెడ్డి తనయుడు రాఘవరెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన ఇంకా ఎన్ని రోజులుగా జైల్లో ఉంటారో చెప్పలేని పరిస్థితి.