Pudukkottai: దారుణం.. టీ కోసం అత్తను రాడ్ తో కొట్టి చంపిన కోడలు?

ప్రస్తుతం సమాజంలో జరిగే కొన్ని రకాల సంఘటనలు చూస్తే ఇవి నిజంగానే జరిగాయా అని అనుమానం వస్తూ ఉంటుంది. ఇంకొన్ని సంఘటనలు అయితే వినడానికి విచిత్రంగా ఉంటే ఇంకొన్ని సంఘటనలు తలుచుకున్న, విన్న తెలియని ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. కొంతమంది అయితే చిన్న చిన్న కారణాలకే ఎదుటి వ్యక్తులను చంపేస్తూ ఉంటారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తాజాగా తమిళనాడులో కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

 

తమిళనాడు రాష్ట్రంలోని పుదుకొట్టై జిల్లా విరాలిమలై సమీపంలోని మలైకుడిపట్టి ప్రాంతానికి చెందిన వేలు పళనయమ్మాళ్ దంపతులు. వీరికి సుబ్రమణి అనే ఓ కుమారుడు ఉన్నాడు. అతను సైకిల్ రిపేర్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. అయితే కొద్దీ రోజుల క్రితమే సుబ్రమణికి గణకు అనే ఓ స్త్రీతో వివాహం జరిగింది. మంగళవారం సుబ్రమణి షాప్ కు వెళ్లగా ఇంట్లో అత్తా కోడలు ఇద్దరే ఉన్నారు. ఈ క్రమంలోనే సుబ్రమణి అమ్మ టీ తీసుకురమ్మని కోడలుకి చెప్పింది. అత్త చెప్పినట్లుగానే టీ తీసుకొచ్చి ఇచ్చింది కోడలు.

అయితే గణకు తెచ్చిన టీ వేడిగా లేదని అత్త కోపగించుకుని, తిట్టింది. దాంతో కోపం పెంచుకున్న కోడలు ఇనుపరాడ్ తో పళనియమ్మాళ్ తలపై బలంగా కొట్టింది. దాంతో తీవ్రంగా గాయపడింది. తీవ్ర రక్తస్రావం అవుతున్న ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఆ తర్వాత ఆమెను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ పళనియమ్మాళ్ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు గణకుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnamraju: రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా.. ఏ దిక్కు లేకపోతే అ పార్టీనే దిక్కవుతుందా?

Raghurama Krishnamraju: ఏపీలో రఘురామకృష్ణం రాజు ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నారు. నిజానికి గత నాలుగేళ్లు ఏపీ రాజకీయాల్లో ఆయన ట్రెండ్ అవుతూనే ఉన్నారు. వైసీపీ ఎంపీల పేర్లు గుర్తు...
- Advertisement -
- Advertisement -