NTR district: దారుణం.. బీరు బాటిల్ తో భార్యపై దాడి చేసిన భర్త?

NTR district: సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అన్నది సహజం. కొంతమంది ఆ గొడవలను చూసి చూడనట్టుగా వదిలేయగా మరి కొంతమంది వాటిని పెద్దవి చేసుకుంటూ విడిపోవడం ఒకరినొకరు చంపడం వరకు కూడా వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం నిందించుకోవడం అవసరం అయితే చంపుకోవడం వరకు కూడా వెళ్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక భర్త తన భార్యని అతి దారుణంగా బీర్ సీసాతో తలపై బాది చంపడానికి ప్రయత్నించాడు. తాజాగా ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి, ఆంజనేయులు దంపతులు మధ్య పెళ్లయిన కొద్ది కాలానికే అభిప్రాయ బేధాలు వచ్చాయి. భర్త ఎప్పుడూ తన మాట వినడని మద్యం సేవించి విచక్షణ లేకుండా దారుణంగా తనను కొడతాడని, ఎప్పుడూ డబ్బులు ఇవ్వాలని బలవంతం చేస్తాడని, ఆ బాధలు భరించలేక కొంతకాలం తల్లిగారి ఇంట్లో ఉంటోంది శ్రీ లక్ష్మి.

 

ఆ తర్వాత వేరే గది తీసుకొని ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలో ఆంజనేయులు ఒంటరిగా ఉన్న శ్రీలక్ష్మి పై అత్యంత దారుణంగా దాడి చేశాడు. పీకలదాకా మద్యం సేవించిన ఆంజనేయులు బీరు సీసాతో శ్రీ లక్ష్మి తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో శ్రీలక్ష్మి తీవ్రంగ గాయపడింది. భర్త దాడి చేసే సమయంలోనే కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. చుట్టుపక్కల వాళ్లు అక్కడికి రావడంతో భయంతో ఆంజనేయులు అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్రీ లక్ష్మిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయాన్ని పోలీసులు సమాచారం అందించగా స్థానికుల సమాచారం మేరకు శ్రీ లక్ష్మి వద్దకు వచ్చారు. ఆమె భర్త ఆంజనేయులు పై నందిగాం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ లక్ష్మి మాట్లాడుతూ పెళ్లైన కొద్ది రోజులకే నా భర్త అసలు రూపం బయట పడిందని, తన భర్త ఒక జేబుదొంగ అని ఎప్పుడూ జైలుకు వెళ్లడం పరిపాటైంది. అంతేకాదు రోజూ మద్య సేవించి నన్ను విపరీతంగా కొట్టడం హింసించడం అలవాటైంది. అక్కడే ఉంటే నా ప్రాణాలకు ప్రమాదం అని అమ్మ వాళ్ల ఇంటి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాను. ఈ క్రమంలో నా భర్త విపరీతంగా తాగి వచ్చి దాడి చేశాడు అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -