Nowrangpur: ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ మానవత్వం మంట కలిసిపోతోంది. సమాజంలో జరిగే కొన్ని రకాల సంఘటనలు చూస్తే సమాజంలో ఇటువంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సమాజంలో మనుషులు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సంఘటన తలుచుకుంటే భయం వేస్తే మరి కొన్ని సంఘటనలు చూస్తే పాపం అనిపించక మానదు. తాజాగా భార్య భర్తలు కలిసి ఒక దారుణానికి ఒడిగట్టారు. భర్త అత్యాచారం చేస్తుండగా భార్య అడ్డుపడకపోగా దానికి సహకరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ దారుణమైన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. నబరంగ్పూర్ జిల్లాలో లిలియా రుంజికర్, పద్మ రుంజికర్ లను నిందితులుగా గుర్తించారు. పద్మ ఆశా వర్కర్గా పనిచేస్తుండగా, లిలియా వరుసకు మరదలైన గర్భిణీపై మోజు పడ్డాడు. గత నెల 28న పద్మ ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాధిత మహిళను నబరంగ్పూర్లోని పఠానా సాహిలోని ఓ ఇంటికి పిలిపించింది. ఇవేమీ తెలియని బాధిత మహిళ రెగ్యులర్ చెకప్లో భాగంగా అక్కడికి వెళ్లింది. అక్కడే ఉన్న పద్మ భర్త గర్భిణీ పై అత్యాచారం చేయగా ఆ దారుణాన్ని పద్మ వీడియో తీసింది. అనంతరం ఈ విషయాన్ని ఎవరికీ అయిన చెబితే చంపేస్తామంటూ బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది.
అయితే మానసికంగా, లైంగిక వేధింపులకు గురికావడంతో సదరు బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను రక్షించారు. పలుమార్లు అడగడంతో చివరకు జరిగినదంతా కుటుంబ సభ్యులకు వెల్లడించింది. దాంతో బాధితురాలు కుటుంబ సభ్యులు కలిసి ఖతీగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రికి తరలించారు. ఖతీగూడ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని చర్యలు చేపట్టారు. నిందితుడు లిలియా, అతని భార్య పద్మలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వాటిని తొలగించారు.