Meerut: దారుణం.. ఆ పిచ్చితో పిల్లల అడ్డు తొలగించుకున్న మహిళ?

Meerut: ఈ మధ్యకాలంలో చాలా మంది పురుషులు స్త్రీలు వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అంతే కాకుండా వివాహేతర సంబంధాల కోసం భార్యాభర్తని చంపడం భర్త భార్యను చంపడం లాంటివి చేస్తున్నారు. కొందరు దుర్మార్గులు అయితే వివాహేతర సంబంధాల కడుపున పుట్టిన పిల్లలను కూడా చంపడానికి వెనకాడడం లేదు. తాజాగా ఒక కసాయి తల్లి అలాంటి పని చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ ప్రాంతంలో ఒక మహిళ నివసిస్తోంది. ఆ వివాహితకు పెళ్లై 10 ఏళ్ల కొడుకు, 6 ఏళ్ల కూతురు కూడా ఉన్నారు. కొంత కాలం పాటు ఆ మహిళ పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఉండేది. దీంతో అలా కొన్ని రోజులు ఆ మహిళ భర్తతో సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చింది. అయితే రాను రాను ఆ వివాహిత బుద్ధి దారిమల్లింది. అంత పెద్ద కూతురు కొడుకుని పెట్టుకొని, తాళి కట్టిన భర్తను కాదనుకొని స్థానికంగా ఉండే ఒక కార్పొరేటర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో కలిసి తిరుగుతూ మహిళ భర్తకు తెలియకుండా చీకటి కాపురం నడిపిస్తూ వచ్చింది.

 

అయితే ప్రియుడితో గడిపేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని ఆ మహిళ భావించింది. ఎలా అయినా పిల్లల అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది ఆ దుర్మార్గపు తల్లి. ఇక అనుకున్నదే ఆలస్యం ప్రియుడితో కలిసి కడుపున పుట్టిన కొడుకు కూతురిని అతి దారుణంగా హత్య చేసి వారి మృతదేహాలు ఎవరికి కనిపించకుండా ఒక కాలువలో పడేసింది. పిల్లలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని వారి స్టైల్లో విచారించగా అసలు నిజాలను చెప్పడంతో వాళ్ళు ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఆమెను ఆమె ప్రియుడిని ఇద్దరినీ అరెస్టు చేశామని కానీ పిల్లలను మృతదేహాలు ఇంకా దొరకలేదు అని పోలీసులు తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -