Babasagar: ప్రేమించే తల్లిదండ్రులను కాదనుకున్న యువతీ చివరికి?

Babasagar: ఈ మధ్యకాలంలో చాలా మంది చదువుకున్న యువత చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని కనిపెంచిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని ఈ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కూతురిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా తల్లిదండ్రులను కాదనుకొని ఒక యువతి దారుణానికి ఒడి గట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో నివసించే మోనాజీ అనే వ్యక్తికి చాలా ఏళ్ల కిందటే వివాహం అవ్వగా పెళ్లైన కొంత కాలానికి వీరికి సువర్ణ 16 ఏళ్ళ కూతురు జన్మించింది.

 

పుట్టిన కూతురుని అల్లారు ముద్దుగా చూసుకుంటూ మంచి స్కూల్లో చదివించారు. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని తమకు మంచి పేరును తీసుకొస్తుందని తల్లిదండ్రులు కూతురిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు అనుకున్న విధంగా కూతురు కూడా చదువులో బాగా రాణిస్తూ అందరి నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇది ఇలా ఉంటే సువర్ణకు గత కొంతకాలంగా కడుపు నొప్పి రావడం మొదలైంది. దాంతో కంగారుపడిన సువర్ణ తల్లిదండ్రులు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి చికిత్స చేయించారు. కానీ సువర్ణకు మాత్రం కడుపునొప్పి తగ్గలేదు.

 

ఇక తాజాగా మరొకసారి విపరీతమైన కడుపునొప్పి రావడంతో ఆ నొప్పిని తట్టుకోలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి మహత్యానికి పాల్పడింది సువర్ణ. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ తాజాగా ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -