Prabhas: ఆ దరిద్రమే ప్రభాస్ ను వెంటాడుతోందా.. అదే తప్పు మళ్లీ చేస్తున్నాడంటూ?

Prabhas: తెలుగు ప్రేక్షకులకు ప్రభాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన బాహుబలి సిరీస్ తో ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు అందరితో ప్రభాస్ మంచి ర్యాపో తన సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా సినిమా అవకాశాలు కూడా అందుకుంటున్నాడు.

ఇక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ రెండు సినిమాలు ప్రభాస్ ను నిరాశపరిచాయి. ఇక త్వరలో విడుదల కాబోయే ఆది పురుష్ సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంటుందని ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత నటించిన సినిమాలకు ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది.

అదేమిటంటే బాలీవుడ్ కి చెందిన టీ సిరిస్ సంస్థ, టాలీవుడ్ మూవీ క్రియేషన్స్ అసోసియేషన్ అవ్వడమే. సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ సినిమాలన్నిటిలో ఈ బ్యానర్లు పంచుకున్నాయి. దాంతో ఇప్పుడు ఆది పురుష్ సినిమా కూడా పూర్తిగా పరాజయం అవుతుందని చాలామంది భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ కు బాలీవుడ్ టీ సిరీస్ సంస్థ ఒక దరిద్రంగా మారిందని అనుకుంటున్నారు.

ఆ దరిద్రమే ప్రభాస్ ను వెంటాడుతుందని తెలుగు ప్రేక్షకులు అనుకుంటున్నారు. మరి ఈ కామన్ పాయింట్ ప్రకారం ప్రభాస్ పరాజయాలకు కారణం బాలీవుడ్ టి సిరీస్ అనే తెలుస్తుంది. మరి ఈ సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆది పురుష్ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమా పైనే బాగా అంచనాలు వేసుకున్నారు. కానీ విడుదలైన టీజర్ ప్రకారం ఈ సినిమా పూర్తిగా నిరాశ పరుచుతుంది అన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ వార్తలను ప్రభాస్ అభిమానులు కూడా చాలా వరకు ఏకీభవిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -