Balakrishna: వైరల్ అవుతున్న బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Balakrishna: డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమా ‘ఆదిత్య 369’. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌లో ‘ఆదిత్య 999 మ్యాక్స్’ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ‘ఆదిత్య 999 మ్యాక్స్’ సినిమాను ప్రారంభించినట్లు బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ సినిమాకు బాలయ్యే దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్టోరీ ప్రిపరేషన్ వర్క్ నడుస్తోందని తెలిపారు. స్క్రిప్ట్ విషయంలో తన కూతురు తేజస్వీని సహాయ చేస్తోందని బాలయ్య తెలిపారు. అలాగే బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ తేజను కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

తాజాగా ఓ మీడియా ఛానెల్‌ ఇంటర్వ్యూలో బాలయ్య పాల్గొన్నారు. ఈ ఛానెల్‌లో మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ‘మోక్షజ్ఞ తేజను ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు స్టెప్ బై స్టెప్‌గా ప్లాన్ చేస్తున్నాం. మధ్య తరగతి కుటుంబం, సెంటిమెంట్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలో ప్రేక్షకులకు, తెలుగు ఆడబిడ్డలకు కనెక్ట్ అయ్యేలా మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఇవ్వబోతున్నాం. అప్పుడే ఇండస్ట్రీలో కొన్నేళ్లపాటు కొనసాగుతాడని తండ్రిగా భావిస్తున్నాను. తన జీవితం బాగుండాలనే ఆలోచిస్తున్నాను. అందుకే మంచి సినిమాతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఒకవేళ అంతా బాగుంటే.. ‘ఆదిత్య 999 మ్యాక్స్’ సినిమాలోనే మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఇవ్వొచ్చు. ఈ సినిమాలో నాతోనే యాక్ట్ చేయబోతాడు. అయితే చాలా మంది మోక్షజ్ఞ తేజను నాతో నటించొద్దని చెప్పారు. నా కొడుకు ఎలా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలో నాకు తెలుసు.. వేరే వాళ్ల సలహాలు నాకు అవసరం లేదు. అయితే ఆదిత్య 369 బాగా హిట్ అయింది. ఆదిత్య 999 మ్యాక్స్ కూడా భారీ ప్రాజెక్ట్ ఫిల్మ్. ఫ్యాంటసీ మూవీ. ఈ సినిమాలో కచ్చితంగా మోక్షజ్ఞ తేజను ఇంట్రడ్యూస్ చేస్తాం.’ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం బాలయ్య కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. మోక్షజ్ఞ తేజ త్వరలోనే సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అభిమానులకు తెలిసి నందమూరి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -