Balakrishna: బాలయ్య సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్!

Balakrishna: నందమూరి బాలకృష్ణ హీగా, మోహినీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఆదిత్య 369’. ఈ సినిమాకు నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ వ్యవహరించారు. టైమ్ ట్రావెలింగ్ కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టింది. మంచి హిట్ టాక్‌తో సినిమా దూసుకెళ్లింది. అలాంటి సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ తాను హోస్ట్ గా కొనసాగుతున్న ‘అన్‌స్టాపబుల్’ షోలో చెప్పుకొచ్చాడు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’ సినిమా సీక్వెల్ కోసం బాలయ్య కథ కూడా రెడీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలయ్య స్టోరీ సిద్ధం చేయడంతో అభిమానుల్లో ఉత్కంఠత నెలకొంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే విషయంపై క్లారిటీ రాలేదు.

 

 

ఆదిత్య 369కి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ రానుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఆదిత్య 369కు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావుకే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయా? లేదా కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చారా? తెలియడం లేదు. ఈ సినిమా కోసం డైరెక్షన్ నాలెడ్జ్ తో పాటు టెక్నికల్ విషయాలపై పట్టు ఉండాలని భావిస్తున్నారట. అలాగే నిర్మాతగా ఎవరూ వ్యవహరిస్తారనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఆదిత్య 369 చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ విషయంపై స్పందించారు. నవంబర్ 11న సమంత నటించిన ‘యశోద’ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత కృష్ణ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

 

 

ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాకు నిర్మాతగా ఎవరు వ్యవహరిస్తారనే విషయంపై కృష్ణ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆదిత్య 369 నాకు మంచి విజయాన్ని అందించింది. ఆ సినిమా నాకొక మైలురాయి లాంటిది. ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు బాలయ్య ప్రకటించారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ సీక్వెల్‌కు నేను నిర్మాతగా వ్యవహరించలేను. ఎందుకంటే ఆ సినిమా భారీ బడ్జెట్‌తో కూడుకుని ఉంటుంది. అంత బడ్జెట్ నేను పెట్టుకోలేను.’ అని చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -