Balakrishna: యంగ్ హీరోలకు ధీటుగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్నారు. ‘అఖండ’ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న బాలయ్య.. ఒక సినిమా షూటింగ్లో ఉండగానే.. మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమా విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నాయి.
యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత బాలయ్య డైరెక్టర్ అనీల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
అయితే బాలయ్య బాబు ఈ సినిమాతోపాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ హిట్ మూవీ ‘కేరాఫ్ కంచెరపాలెం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకటేష్ మాహాతో బాలయ్య సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. అయితే డైరెక్టర్ వెంకటేశ్ మాహా..
బాలయ్య బాబు కోసం ఓ స్టోరీ కూడా సిద్ధం చేశారట. బాలయ్యకు స్టోరీ కూడా చెప్పాడట. అయితే స్టోరీలో కొన్ని ఛేంజేస్ చేయాలని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వెంకటేశ్ మాహా స్టోరీలో కొన్ని మార్పులు చేశారు. ఆ కథను బాలయ్యకు కూడా వినిపించారు.
స్టోరీ బాగా నచ్చడంతో బాలయ్య సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య బాబు సినిమా పూర్తయితే.. ఆ తర్వాత వెంకటేశ్ మహాతో సినిమా చేసే ఛాన్స్ ఉంది.
అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో వైపు బాలయ్య ‘ఆదిత్య 369’ సినిమా సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం బాలయ్యనే సినిమాకు స్టోరీ రాస్తున్నారట. ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అని టైటిల్ కూడా పెట్టారు.