Balakrishna: ఇండస్ట్రీలో మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ సంస్థ రెండు భారీ సినిమాలు తీసి చేతులారా లాభాలు సంపాదించాలనుకున్నా.. మైత్రీ మూవీస్ సంస్థ ఆశలను అమావాస్య నీరు కార్చినట్లు అయింది. శుక్రవారం నాడు అమావాస్య రాకుండా ఉంటే రెండు సినిమాలో ఒక్కో నెలలో విడుదలై ఉండేవి. టాలీవుడ్ పెద్ద హీరో బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా డిసెంబర్లో విడుదల కానుండగా.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతికి విడుదల కానున్నది. ఈ రెండు సినిమాలు వేరు వేరు డేట్స్ లో విడుదల చేస్తే.. లాభాలు సంపాదించి ఉండేవారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న విడుదల చేయాలని చిత్ర యూనిట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ బాలయ్య బాబు తిధులు, నక్షత్రాల విషయంలో ఎంతో పట్టుదలగా ఉంటారని చిత్ర బృందం మర్చిపోయినట్లుంది. ఈ సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్లారు. అంతేకాదు.. ఈ సినిమాకి సంబంధించి థియేటర్ల లెక్కలు వివరించడంతో దానికి అంత ఓకే చెప్పారు. అయితే ఎవరు చెప్పారో తెలీదు కానీ బాలయ్య బాబుకు డిసెంబర్ 23న శుక్రవారం అమావాస్య అని తెలిసింది. దీంతో ఈ సినిమా వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
ఇలాంటి సమయంలో చిత్ర బృందం ఒకటి రెండు రోజుల ముందు ముహర్తం చూసుకుని, షో వేసుకుని, టికెట్ కట్ చేసుకుని, ఇలాంటి అడ్జెస్ట్ మెంట్లు చేసుకుంటారు. అయితే అక్కడ ఉన్నది బాలయ్య.. అలాంటి వ్యవహారాలు ఆయనకు నచ్చవు. దీంతో సినిమా డిసెంబర్ 23న విడుదల చేయడానికి బాలయ్య ససేమిరా కాదన్నారు. సినిమా డేట్ కూడా మార్చుకోవాలని చిత్ర బృందానికి సూచించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ పది, పన్నెండు తేదీల్లో రిలీజ్ చేయాలని అనుకున్నా.. అప్పుడు శృతిహాసన్ డేట్స్ అందుబాటులో ఉండవని సమాచారం. అంత త్వరగా కూడా సినిమా పూర్తి కాదు. విడుదలకు ఇబ్బంది అవుతుంది. దీంతో బాలయ్య సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం నిర్ణయించుకుంది.