Balayya: కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ నందమూరి బాలకృష్ణ దూసుకెళ్తున్నారు. యువ హీరోలతో పోటీ పడుతూ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అయితే తాజాగా బాలకృష్ణ తన అభిమానులకు అదిరిపోయే గుడ్న్యూస్ తెలిపారు. అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న ‘ఆదిత్య 369’ సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘ఆదిత్య 999’పై బాలయ్య కీలక అప్డేట్ ఇచ్చారు. 1991లో విడుదలైన ‘ఆదిత్య 369’ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్లో సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం చేశారు. గతంలోనూ ఆదిత్య 369 సినిమా సీక్వెల్ చేస్తామని బాలకృష్ణ ప్రకటించారు. ఈ సినిమాకు బాలయ్యనే స్క్రిప్ట్ రాస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు దానిపై ఎలాంటి అప్డేట్ రాలేదు.
యంగ్ హీరో విశ్వక్సేన్ హీరోగా నటించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ను బాలకృష్ణ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా బాలయ్య.. ఆదిత్య 369 సీక్వెల్పై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఆదిత్య 999 సినిమాను ప్రారంభించనున్నట్లు బాలయ్య తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే ఈ చిత్రానికి తానే స్వయంగా డైరెక్ట్ చేస్తున్నట్లు బాలయ్య తెలిపారు. అయితే ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన విషయాన్ని బాలయ్య తెలిపారు. ఆదిత్య 999 సినిమాలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అందుకే ఈ సినిమాలో అద్భుతమైన వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ డిజైన్స్ వాడనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాలయ్య కూతురు తేజస్వినీ కూడా క్రియేటివ్ టీమ్తో కలిసి పని చేస్తున్నారట. ఇప్పటికే బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్స్టాపబుల్’ షోలో తేజస్వినీ ఇన్వాల్మెంట్ ఉంది. ఆమె వెనకనుంచి చేస్తున్న మేకోవర్ వల్లే షో సక్సెస్ఫుల్గా రన్ అవుతోందని ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు.