Balayya: ఆ హీరో వద్దనుకంటే బాలయ్య ఓకే చెప్పాడా?

Balayya: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటసింహం అయిన నందమూరి బాలయ్య తాజాగా వీరసింహారెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ఆయన కెరియర్ లోనే 107వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్ ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి బాలయ్య సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 

ఈ సినిమాలో బాలయ్యలోని మరో మాస్ యాంగిల్ అందరికీ కనపడుతుందని ఇప్పటికే ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి గోపీచంద్ మలినేని ఈ సినిమా కథను మెగా హీరో కోసం రాసుకున్నాడని, రామ్ చరణ్ కోసమే ఈ కథను సిద్ధం చేసుకున్నాడని, అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందే ఈ మూవీ కథ సిద్ధం అయినట్లు వినపడుతోంది. కథను ఆ టైంలోనే రామ్ చరణ్ కు చెప్పడంతో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుదామని చెప్పినట్లు సమాచారం.

 

ఈ నేపథ్యంలో క్లైమాక్స్ బాగోలేదని కొంచెం చేంజస్ చేసి మరోసారి కనిపించాలని రామ్ చరణ్ చెప్పడంతో గోపిచంద్ మాత్రం క్లైమాక్స్ మార్చడానికి ఇష్టంగా లేదని తెలుస్తోంది. ఆ తర్వాత గోపీచంద్ అదే కథను నందమూరి బాలయ్యకు చెప్పడతో ఆయన ఎంతగానో ఇష్టపడ్డాడట. వెంటనే ఇంప్రెస్ అయిపోయి అగ్రిమెంట్ పేపర్లను కూడా తెప్పించమని సైన్ చేసినట్లు సమాచారం.

 

ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరి రామ్ చరణ్ కు నచ్చని క్లైమాక్స్ బాలయ్యకు నచ్చిన క్లైమాక్స్ సినీ ప్రేక్షకులకు ఎలా ఉంటుందో వేచి చూడాలి. వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాలో బాలయ్య మరింత ఎనర్జిటిక్ గా కనిపించనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -