Balayya: వైసీపీకి షాక్ ఇచ్చే దిశగా బాలయ్య అడుగులు.. అలా చేయనున్నారా?

Balayya: వచ్చే ఏడాది ఏపీలో రాష్ట్రస్థాయిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటినుంచే రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే టిడిపి అలాగే జనసేన పార్టీలు ప్రచారాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రచార విషయంలో ఎవరు వెనక్కి తగ్గేటట్టుగా కనిపించడం లేదు. ఏపీ ప్రజల్లో కూడా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా నిలవనున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

అయితే ఏపీలో ప్రస్తుతం 50 శాతం టీడీపీ నే వస్తుంది అని కొందరు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా మరికొందరు, కచ్చితంగా వైసీపీ మరోసారి గెలుపొందుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే రెండుసార్లు ఏపీ సీఎం గా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ మూడోసారి కూడా పోటీ చేయడం కోసం సిద్ధపడుతున్నాడు. అయితే ఈసారి ఎలా అయినా వచ్చే ఎన్నికలలో గెలుపొందాలి అని చాలా కసిగా ఎదురుచూస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వారాహి వాహనంపై ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

 

మరోవైపు చంద్రబాబు నాయుడు బాలకృష్ణ అలాగే నారా లోకేష్ లో కూడా టిడిపి పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాలలో సైకిల్ బాగానే కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీని ఓడించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో 170 స్థానాలలో వైసీపీని ఓడించాలి. ఓడించి చూపిస్తాను అని బాలకృష్ణ గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో వైసీపీకి షాక్ ఇచ్చే దిశగా బాలయ్య బాబు అడుగులు వేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -