Balayya: నేడు ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు నందమూరి అభిమానులు అలాగే టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ ని ప్రశంసలతో ముంతెత్తుతున్నారు. టిడిపి నేతల హంగామా చూస్తుంటే మానవత్వం లేకుండా తనకు వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ తీవ్రంగా తిట్టిపోసింది ఈ చంద్రబాబునాయుడినేనా అని సందేహం కలుగుతుంది. జీవిత చరమాంకంలో తండ్రిని ఘోరంగా అవమానించి, మానసికంగా వేధించి ఆయన చావుకు ఎన్టీఆర్ వారసులు తలా ఒక చేయి వేశారనే విమర్శలు లేకపోలేదు.
ఎన్టీఆర్ కు పది మందికి పైగా పిల్లలున్నప్పటికీ ఏ ఒక్కరూ తండ్రి ఆవేదనలో పాలు పంచుకోలేదు. పైగా ఆయన కన్నీళ్లకు కారకులై, తండ్రికి శాశ్వతంగా రుణపడ్దారనే చెడ్డపేరును తెచ్చుకున్నారు. ఇవన్నీ చాలదన్నట్టు ఆ రోజు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవడాన్ని సమర్థిస్తూ… అన్స్టాపబుల్గా ప్రచారం చేయడానికి తనయుడు నందమూరి బాలకృష్ణ బాధ్యతలు తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ తదితర కుటుంబ సభ్యులు నివాళులు ర్పించారు.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ కొడుకుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారని, ఎన్టీఆర్ అందరికీ నచ్చే అరుదైన వ్యక్తి అని తెలిపారు సీనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజెన్లు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ కడుపున పుట్టడం మీ అదృష్టం, ఆ పెద్దాయన దురదృష్టం అని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇటువంటి అసమర్థ పిల్లల్ని కనడం వల్లే చంద్రబాబు ఆటలు సాగాయని, మరే నాయకుడికి ఎన్టీఆర్ కు పట్టిన దుస్థితి రాకూడదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.