Before Death: చనిపోయే ముందు కనిపించే లక్షణాలివే..స్వర్గానికి వెళ్లేవారు ఎవరంటే

Before Death: పుట్టిన మనిషి గిట్టక తప్పదు. ఇదే జరిగే సత్యం. చాలా మంది మరణించే ముందు వారికి కొన్ని లక్షణాలు తెలుస్తాయట. కొంతమందికి వారు చనిపోవడం ముందే తెలుస్తుంది. ఆ లక్షణాలు కనిపిస్తే వారు స్వర్గానికి వెళ్తారనే నమ్మకం హిందూ సంప్రదాయంలో ఉంది. మనిషి చనిపోయిన తర్వాత వారి నుంచి ఆత్మ వేరు అవుతుంది.

 

హిందూ ధర్మ గ్రంధం అయిన భగవద్గీత ప్రకారంగా చూస్తే మనిషిలో నవరంద్రాలు అనేవి ఉంటాయి. జీవితంలో ఎవరైతే మంచి పనులు చేసుంటారో వారి ఆత్మ పై నుంచి వెళ్తుంది. కళ్లు, ముక్కు, నోరు ఉండేదానిని ఎగుర భాగం అంటారు. వీటి నుంచి ఆత్మ బయటకు వెళ్తే వారు స్వర్గానికి వెళ్తారట.

 

ఒక వేళ ఆత్మ ముక్కు నుంచి బయటకు వెళ్తే ముక్కు కొంచెం వక్రంగా మారడం మనం గమనించొచ్చు. కళ్ల నుంచి ఆత్మ బయటకు వెళ్తే కళ్లు మూసుకోవట. ఒక వేళ చెవి నుంచి ఆత్మ బయటకు వెళ్లుంటే చెవి కూడా కాస్తా పైకి లాగినట్లు కనిపిస్తుందట. నోరు నుంచి ఆత్మ బయటకు వెళ్తే ఆ నోరు తెరుచుకునే ఉంటుందట. బతికినంత కాలం ఎలా బతికినా, తప్పు చేసినా మంచి చేసినా చనిపోయే ముందు వారి ముఖం నవ్వుతూ ఉన్నట్లైతే వారు స్వర్గానికి వెళ్తారట.

 

జీవితంలో మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. అలా చెడుగా బతికినవారు, చెడు పనులు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టినవారు చనిపోతే వారి ముఖంలో మరణ భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందట. గరుడ పురాణం ప్రకారంగా చూస్తే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మను తీసుకెళ్లడానికి యమధూతలు వస్తారు. ఆ సమయంలో జీవితంలో తప్పులు ఎక్కువగా చేసిన వారు భయం కారణంగా శరీరం నుంచి ఒత్తిడికి లోనై మలం, మూత్రం బయటకు వచ్చే అవకాశం ఉంది. అలా చనిపోయే ముందు మలం, మూత్రం ఎవరికైతే బయటకు వచ్చి ఉంటుందో వారు నరకానికి వెళ్తారట.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -