Bhuma Mounika: భూమా మౌనిక కామెంట్లు వింటే మాత్రం షాకవ్వాల్సిందే!

Bhuma Mounika: టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి గత నెల మార్చి 3వ తేదీన మూడుముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ కొత్త దంపతులు ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలు షోలకు హాజరవుతూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి ఇద్దరు కలిసి ఈటీవీలో వెన్నెల కిషోర్ పోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమా మౌనిక రెడ్డి మంచు మనోజ్ లో వారి కెరియర్లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మౌనిక రెడ్డి మాట్లాడుతూ.. అమ్మ చనిపోవడం, ఆ రెండో రోజులకే రోడ్‌ క్యాంపెయిన్‌లో పాల్గొవల్సి రావడం, అక్క, నేను, తమ్ముడు, నాన్న ఇలా ప్రజా జీవితంలోనే ఉండిపోయాము.

 

ఎన్నికలు కావడంతో ఏం చేద్దాం అనుకునే సమయం కూడా లేదు. ఆ తర్వాత అక్క రాజకీయాల్లోకి వచ్చారు. నేను నా జీవితంలో ముందుకు వెళ్లిపోయాను. మా నాన్న చాలా ఇబ్బంది పడ్డారు. అమ్మ చనిపోయిన తరువాత మూడేళ్లకు నాన్న కూడా మాకు దూరమాయ్యరు. ఆ రెండు సంఘటనలతో జీవితంలో ఇంతకన్నా ఇంకేం జరుగుతుంది అన్న తెగింపు వచ్చింది. అమ్మ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆమె జయంతి రోజున చాలా ఒంటరిగా ఫీలయ్యాను. కుటుంబ పెద్దల్ని కోల్పోయాము. ఆ సమయంలో జీవితం శూన్యంగా అనిపించింది. పైగా నా వ్యక్తిగత జీవితంలో సమస్యలుఇవన్నీ మానసికంగా నన్ను మరింత కుంగదీశాయి. అప్పుడు అమ్మను తలుచుకుని అమ్మా.. నువ్వు ఎక్కడ ఉన్నా, నాకేం కావాలో నీకు తెలుసు. నీ ఆశీస్సులు నాకు కావాలి. అంతా నీకే వదిలేస్తున్నాను.

నా జీవితంలో నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానో అక్కడ ఉంచు అని కోరుకున్నాను అని చెప్పుకొచ్చింది భూమా మౌనిక రెడ్డి. అనంతరం మంచు ఫ్యామిలీ గురించి స్పందిస్తూ.. మామయ్య మోహన్‌ బాబుగారు సరదా మనిషి, పెళ్లి కాకముందు ఇంటికి వెళ్లినప్పుడు అన్నం తినిపించారు. నన్నూ, నా కొడుకు ధైరవ్‌ను సొంతవాళ్లలా దగ్గరకు తీసుకున్నారు. అది నాకు దేవుడిచ్చిన వరం. అమ్మ చనిపోయినప్పుడు నుంచి ఆంటీ నాతో ఫోన్‌ టచ్‌లో ఉంటారు. ధైర్యం చెబుతుంటారు. కోడలిగా కాకుండా కూతురుగా కుటుంబంలోకి ఆహ్వానించారు. అంతకుమించి నాకేం కావాలి. ఇక లక్ష్మీ గురించి ఏం చెప్పాలి. మా ఇద్దరి మధ్య అనుబంధాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. మాది అందమైన అనుబంధం. నాకు అమ్మ స్థానంలో నిలబడింది. నన్ను ఒక చిన్నపిల్లలా చూస్తుంది. ఆమే నాకు అన్నీ. ఇక నా భర్త మనోజ్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది మౌనిక రెడ్డి.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -