Ramya Raghupathi: నటి పవిత్ర లోకేష్, నటుడు నరేష్ ల పేర్లు గత కొన్ని నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక విషయంతో ఈ జంట వార్తల్లో నిలుస్తూనే ఉంది. వీరిద్దరి ప్రేమ పెళ్లి వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పటికే ఈ జంటపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించడంతో పాటు నెటిజన్స్ దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేసిన విషయం తెలిసిందే. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు వారి గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు అంటూ కేస్ కూడా పెట్టిన విషయం తెలిసిందే.
అయితే మొదట్లో విడుదల సహజీవనం చేస్తున్నారని త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు అంటూ వార్తలు వినిపించినప్పటికీ అందరూ ఎటువంటి నిజం లేదు అంటూ ఆ వార్తలను కొట్టి పడేసారు. కానీ ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా కొత్త సంవత్సరం కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం త్వరలోనే మా పెళ్లి మీ విషెస్ తప్పకుండా కావాలి అని నరేష్ ఒక వీడియోని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇలా ఉంటే తాజాగా ఊహించిన విధంగా నరేష్ పవిత్ర లోకేష్ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.
తాజాగా అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని నరేష్ స్వయంగా తెలపడంతో ఈ వార్త ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా వీరి పెళ్లికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్న ఈ జంట తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.