Tollywood: సౌత్ సినిమాలపై బాలీవుడ్ డైరెక్టర్ కు ఇంత కోపమా?

Tollywood: దేశంలో ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల హవా నడిచేది. ఆ సినిమాలు చేసినంత మార్కెట్ ఏ సినిమాలు చేయకపోవడం, ఆ సినిమాల్లో నటించే అవకాశం, సినిమాల్లో పని చేసే అవకాశం వస్తే అప్పట్లో అదృష్టంగా ఫీలయ్యే సందర్భాలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రాంతీయ భాషా సినిమాల హవా ఇప్పుడు నడుస్తోంది.

 

మరీ ముఖ్యంగా దక్షిణాదిలో వస్తున్న సినిమాలు దేశవ్యాప్తంగా తడాఖా చూపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో వస్తున్న సినిమాలకు విపరీతమైన మార్కెట్, క్రేజ్ క్రియేట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు బాలీవుడ్ సినిమాల మేనియా తొలగిపోయి దక్షిణాది సినిమాల క్రేజ్ అందరికీ అంటుకుంది. దీంతో దక్షిణాది సినిమాలను కూడా పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తుండటంతో మార్కెటింగ్ బాగా పెరిగింది.

 

తెలుగులో వచ్చిన పుష్ప సినిమాతో పాటు కన్నడలో వచ్చిన కాంతార, కేజీఎఫ్2లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలు సొంత భాషలో విడుదలై, ఆ తర్వాత ఇతర భాషల్లోకి డబ్ అయి అదరగొట్టేశాయి. అయితే ఈ సినిమాల గురించి ఓ బాలీవుడ్ డైరెక్టర్ చేసిన కామెంట్లు ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కాంతార, పుష్ప, కేజీఎఫ్2 లు చెత్త సినిమాలు అంటూ బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్ చేశాడు.

 

బాలీవుడ్ లో విలక్షణ సినిమాలు తీసే డైరెక్టర్ గా, ఈ మధ్యన కొన్ని సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంటున్న నటుడిగా గుర్తింపు సాధించిన అనురాగ్ కశ్యప్ ఈ కామెంట్లు చేయడం అందరిలో చర్చకు దారి తీసింది. దక్షిణాది సినిమాల్లో కూడా నటించిన అనురాగ్.. ఇప్పుడు ఈ సినిమాల గురించి నెగిటివ్ గా కామెంట్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

 

డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దీనిపై స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. దీంతో ఈ ట్రెండ్ పైనే బాలీవుడ్ దర్శక, నిర్మాతలు దృష్టిపెడుతున్నారు. ఇప్పుడు ఇదే బాలీవుడ్ ను నాశనం చేస్తోంది. పుష్ప, కేజీఎఫ్2, కాంతార వంటి సినిమాలు దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిండొచ్చు. కానీ అలాంటిట సినిమాలు బాలీవుడ్ లో వర్కవుట్ కావు. వాటినే కాపీ కొట్టి పాన్ ఇండియా సినిమాలుగా తీయాలని చూస్తే మాత్రం బాలీవుడ్ కు భారీ నష్టం తప్పడు. ప్రస్తుతం బాలీవుడ్ కు కావాల్సింది పాన్ ఇండియా సినిమాలు కాదు. ఇండస్ట్రీకి ధైర్యం చెప్పే సినిమాలు. కథల్లో ఎప్పుడూ కొత్తదనం ఉండాలి. అప్పుడే సినిమాలు హిట్ అవుతాయి’’ అని అన్నాడు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -