BreakingNews: రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. కుటుంబ సభ్యులను సైతం అతి దారుణంగా హత్యలు చేయడానికి సైతం వెనకాడటం లేదు. కొడుకు తండ్రిల మధ్య తలెత్తిన చిన్న వివాదంలో తండ్రి చనిపోగా అతని శరీరాన్ని ముక్కులు ముక్కలుగా చేసిన కొడుకుకు తల్లే సహయం చేయడం గమన్హరం. ఇటీవల ఢిల్లి శ్రద్ధావాకర్ను ప్రియుడు హత్యచేసి ముక్కలు ముక్కలు చేసిన ఘటన మరవక ముందే అదే తరహా ఓ వ్యక్తి తన కన్న తండ్రిని చంపి ముక్కలు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన ఘటనతో దేశ ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ బెంగల్లోని పరూర్పూర్ పరిధిలో నేవీ విభాగంలో విధులు నిర్వర్తించి రిటైర్డ్ ఉద్యోగి ఉజ్వల్ చక్రవర్తి (22) కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. పాటిటెక్నిక్ చదువుతున్న చక్రవర్తి కుమారుడు పది రోజుల క్రితం కాలేజీ ఫీజు విషయమై తండ్రితో స్వల్ప వివాదం జరిగింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటమాట పెరిగి గొడవ పెద్దదయింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన కొడుకు చక్రవర్తిని గట్టిగా పక్కకు నెట్టేయడంతో అక్కడే ఉన్న కుర్చీకి తల గట్టిగా తగలడంతో చక్రవర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అంతటితో ఊరుకోని కొడుకు తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత తల్లి సహాయాన్ని తీసుకుని మృతదేశాన్ని ఐదారు ముక్కలుగా చేశాడు.
ఆ తర్వాత ఆ ముక్కలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి మరుమార్లు సైకిల్పై పెట్టుకుని ఇంటికి దూరంగా వేర్వురు ప్రాంతాల్లో పాడేశాడు. హత్యచేసి రెండ్రోజుల తర్వాత తల్లీకొడుకులు పోలీస్ స్టేషన్లో చక్రవర్తి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఇద్దరి మాటల్లో పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించగా కొడుకు నేరాన్ని అంగీకరించాడు. తన భర్త రోజూ ఇద్దరిని వేధించేవాడని అందుకే ఈ ఘతుకానికి పాల్పడ్డామంది. నిందితుల చూపించగా ఓ చెయ్యి, కాలు మరిన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.