Lokesh: చంద్రబాబు చేసిన మోసాలను రెడ్లు మరవరుగా.. ఎలా నమ్మాలయ్యా లోకేశ్!

Lokesh: ఏపీలో 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని అస్త్రాలను లోకేశ్ ప్రయోగిస్తున్నారు. ఏపీలో రెడ్డి కులానికి చెందిన వాళ్లు సీఎం జగన్ కు అనుకూలంగా ఉన్నారు. జగన్ కు కలకాలం రెడ్ల సపోర్ట్ ఉంటుంది. 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని జగన్ నెరవేర్చారు. అయితే రెడ్లను ఆకట్టుకోవడానికి లోకేశ్ చూపిస్తున్న ప్రేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

చంద్రబాబు, లోకేశ్ మాటలను రెడ్డి కులానికి చెందిన వాళ్లు నమ్మితే మాత్రం నట్టేట మునిగినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ పాదయాత్రలో భాగంగా వైసీపీ అధికారంలోకి రావడం వల్ల జగన్, పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల మాత్రమే బాగు పడ్డారని చెప్పారు. కాంట్రాక్టర్లు అయిన రెడ్లను జగన్ ఇబ్బందులు పెడుతున్నారని జగన్ పాలనలో రెడ్లు నష్టపోయారని ఆయన పేర్కొన్నారు.

 

టీడీపీ అధికారంలోకి వస్తే రెడ్డి భవన్ ను ఏర్పాటు చేసి పేద కులాలకు చెందిన రెడ్లను ఆదుకుంటామని లోకేశ్ పేర్కొన్నారు. అయితే లోకేశ్ మాటల్లో ఎలాంటి నిజం లేదు. రెడ్లు ఎవరూ జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఎల్లో మీడియా మాత్రమే ఈ తరహా అసత్య ప్రచారాలు చేస్తోంది. వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రెడ్లకు జరిగిన అన్యాయం అంతాఇంతా కాదు.

 

టీడీపీ వైయస్సార్ కు సన్నిహితుడైన విద్యుత్ సంస్థ ఛైర్మన్ రమాకాంత్ రెడ్డిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. డీజీపీ ఆంజినేయ రెడ్డిని కుల వివక్షతో వేధించి ఆయనకు దక్కాల్సిన ప్రయోజనాల విషయంలో అన్యాయం చేసింది. ఐపీయస్ అధికారి దినేష్ రెడ్డిని నాలుగేళ్ల పాటు కుల వివక్షతో పక్కన పెట్టిన చెత్త ఘటన టీడీపీకి మాత్రమే సొంతం. ఐపీయస్ అధికారి గోపీనాధ్ రెడ్డిని సైతం టీడీపీ ఇబ్బందులు పెట్టింది.

 

చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించి పోలీసులతో కొట్టించడం టీడీపీకి రెడ్లపై ఎంత కసి, కోపం, పగ ఉందో చెప్పడానికి నిదర్శనం. రెడ్డి పేరు ఉండటం వల్ల టీడీపీ ఇబ్బందులకు గురి చేసిన వాళ్ల సంఖ్య వందల్లో ఉంది. చంద్రబాబు గుణం తెలుసు కాబట్టే రెడ్డి ఓటర్లు ఆయనకు దూరంగా ఉన్నారు. జగన్ ఏ తప్పు చేయకపోయినా పచ్చ పత్రికల ద్వారా జగన్ గురించి, ఆయన కుటుంబం గురించి చంద్రబాబు, లోకేశ్ ఏ స్థాయిలో దిగజారి ప్రచారం చేస్తున్నారో ఆందరికీ తెలుసు.

 

వైఎస్సార్, జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారన్న నిజం చంద్రబాబు, లోకేశ్ కు తెలుసు కాబట్టే రెడ్లపై లోకేశ్ కపట ప్రేమను చూపిస్తున్నారు. అయితే లోకేశ్ నాటకాలు తమకు తెలుసని జగన్ గురించి తప్పుగా ప్రచారం చేసినా తాము నమ్మబోమని రెడ్డి సామాజిక వర్గం నేతలు చెబుతున్నారు. తమ చివరి శ్వాస వరకు వైసీపీతోనే ఉంటామని రెడ్డి సామాజిక వర్గం నేతలు వెల్లడిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -