Chinmayi: ఆ నటుడిపై చిన్మయి షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

Chinmayi: సినీ గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నా సింగర్ చిన్మయి. ఇప్పటివరకు టాలీవుడ్‌లో పలు విజయవంతమైన సినిమాలకు డబ్బింగ్ చెప్పి నంది అవార్డులు కూడా గెలుచుకుంది. అయితే సింగర్‌గా కంటే సామాజిక వేత్తగా ఆమెకు మంచి పేరుంది. ఆడపిల్లలకు కష్టం వచ్చిందంటే చాలు అర క్షణం కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్తుంటారు. సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లకు జరిగే అవమానాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉంటారు. ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడితే మాత్రం చిన్మయి ఊరుకోదు. సోషల్ మీడియా వేదికగా వారిని ఏకిపారేస్తారు. తాజాగా కోలీవుడ్ నటుడు సతీష్‌పై సింగర్ చిన్మయి ఫైర్ అయ్యారు. అయితే నటుడు సతీష్‌పై మండిపడటానికి ఓ కారణం ఉంది.

 

 

బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్, కోలీవుడ్ హీరోయిన్ దర్శన గుప్తా కలిసి ‘ది ఘోస్ట్’ సినిమాలో నటించారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్‌లో సతీష్ చేసిన కామెంట్లపై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. సతీష్ మాట్లాడుతూ.. ‘ముంబై నుంచి వచ్చిన సన్నీ చీర కట్టుకుని పద్ధతిగా కనిపిస్తోంది. కానీ ఇక్కడే పెరిగిన అమ్మాయి మాత్రం మోడ్రన్ డ్రెస్‌లో వచ్చింది. అయితే నేను ఆమెను కించపరచడం లేదు. జస్ట్ పాయింట్ అవుట్ చేస్తున్నాను.’ అని చెప్పాడు.

 

దీంతో ఈవెంట్‌లో పాల్గొన్న ఆడియన్స్ అందరూ పగలబడి నవ్వారు. కానీ సింగర్ చిన్మయి మాత్రం సీరియస్ అయింది. ‘అంతమంది ఉన్న వేడుకలో ఒక స్త్రీని పాయింట్ అవుట్ చేసి మాట్లాడటమేమిటి? పబ్లిక్‌గా ఆమె వేసుకున్న డ్రెస్ గురించి కామెంట్ చేయడమేంటి? ఇందులో పెద్ద జోక్ ఉన్నట్లు అందరూ పగలబడి నవ్వడమేంటి? మహిళలు వేసుకున్న డ్రెస్సులపై కామెంట్స్ చేసే ఇలాంటి మగాళ్లు ఎప్పుడు మారుతారో తెలియడం లేదు.’ అంటూ చిన్మయి అసహనం వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం చిన్మయి పోస్ట్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -