Chiranjeevi: చిరంజీవిపై అలిగిన అనసూయ.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Chiranjeevi: ప్రస్తుతం చిరంజీవి టాలీవుడ్ అగ్రస్టార్ హీరోగా వెలుగుతున్నాడు. ప్రస్తుతం యువ హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటున్నాడు. ఇక ఈరోజు అనగా అక్టోబర్ 5 చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. కాగా ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ ల తో బాగా హడావిడి చేసింది. కాగా ఈ సినిమాపై చిరు బాగా ఆశలు పెట్టుకున్నాడు.

ఇదిలా ఉంటే చిరంజీవిపై అనసూయ అలిగిందట. అసలు వివరాల్లోకి వెళితే చిరు గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపురంలో నిర్వహించారు. భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహించగా అక్కడ అనుకోకుండా వర్షం పడింది. అయినప్పటికీ చిరు తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఇక వర్షం కారణంగా చిరు తన ప్రసంగాన్ని త్వరగా పూర్తి చేశాడు. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కొందరి నటుల పేర్లు మాత్రమే చిరంజీవి బయట పెట్టాడు.

ఇక కొందరి పేర్లు ప్రస్తావించడం మరిచిపోయాడు చిరు.. అందులో అనసూయ కూడా ఒకరు. ఆమె కూడా సినిమాలో ఒక పాత్ర చేసింది. ఆ వేడుక పూర్తయిన తర్వాత ఈమధ్య చిరంజీవిని అనసూయ కలిసి సార్ అనంతపురం వేడుకలో నా గురించి చెప్పడం మరిచిపోయారు అని అడిగేసింది. అంతేకాకుండా బుంగమూతి కూడా పెట్టిందట. ఆ విషయం మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో చిరంజీవి బయట పెట్టాడు. తర్వాత అందరికీ ఫోన్ చేసి సారీ చెప్పానని చిరంజీవి తెలిపాడు.

ఇక భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు ఈరోజు వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజుతో ఎటువంటి టాక్ క్రియేట్ చేసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి సోషల్ మీడియాలో గాడ్ ఫాదర్ సినిమా కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. మెగా అభిమానులైతే గాడ్ ఫాదర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -