Chiru Shruti: కూతురి వయసున్న శృతి హాసన్‌తో చిరు రొమాన్స్ చేస్తున్నారా?

Chiru Shruti: చిరంజీవి-శృతిహాసన్ జోడిగా నటిస్తోన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. కేథరిన్ థ్రాసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనమ్ తదితరులు కీలక పాత్రలో నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫోటోలు, సాంగ్స్ ప్రేక్షకులు.. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా నుంచి బాస్ పార్టీ సాంగ్ విడుదలై.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా రాసి కంపోజ్ చేసిన ఈ పాటకు సింగర్స్.. నకాశ్ అజీజ్, డీఎస్పీ, హరిప్రియ పాడారు. బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా-చిరంజీవి కాంబోలో వచ్చిన ఈ సాంగ్ మాస్ ఆడియన్స్‌ ను ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాపై ఓ రూమర్ స్ప్రెడ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి తనకంటే చిన్న వయసున్న హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి వయసు 67 ఏళ్లు. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న శృతిహాసన్ వయసు 36 ఏళ్లు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్‌లో దాదాపు 31 ఏళ్లు. తనకంటే మూడు పదుల వయసు తక్కువగా ఉన్న అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కాగా, శృతి హాసన్.. మూడేళ్ల విరామం తర్వాత టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. వచ్చి రాగానే బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో వరుగా మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకుంది. ఇందులో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు జనవరిలోనే రిలీజ్ అవ్వనున్నాయి. అయితే శృతిహాసన్‌కు ఆఫర్లు తగ్గడానికి సీనియర్ హీరోలతో నటించడమే కారణమని ఈ మధ్యకాలంలో చాలానే పుకార్లు వినిపించాయి. సీనియర్ హీరోలతో జోడిగా నటిస్తున్న ఈ భామతో నటించడానికి యంగ్ హీరోలు ఆసక్తి చూపించడం లేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -