KCR: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. ఏం చెప్పారంటే?

KCR: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్తను చెప్పారు. ఆ వర్గానికి చెందిన ఒక్కొక్కరి ఖాతాలో ఈయన లక్ష రూపాయలు జమ చేయబోతున్నారని తెలియడంతో తెలంగాణ ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. తెలంగాణలోని బిసి కులవృత్తులు, చేతి వృత్తిదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఈ పథకానికి అర్హత పొందిన వారందరూ కూడా https://tsobmmsbc.cgg.gov.in/applicationFormforBC.action ఈ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఫోటో, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఈనెల తొమ్మిదవ తేదీ ప్రారంభించబోతున్నట్లు మంత్రి తెలియజేశారు.

 

మంచిర్యాల జిల్లాలో ఈ నెల 9వ తేదీ లక్ష రూపాయలు ఆర్థిక సాయం పంపిణీ ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది.కులవృత్తులు చేతివృత్తుల వారు వారి పనిముట్లను ఇతర సామాగ్రిని కొనుగోలు చేయడానికి సీఎం కేసీఆర్ ఆసరాగా ఈ లక్ష రూపాయలను నేరుగా వారి ఖాతాలో జమ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విధంగా కేసీఆర్ ఆర్థిక సహాయం అందించడంతో సదురు సామాజిక వర్గానికి చెందిన వారందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -