Crime News: యువతని 49 సార్లు పొడిచి చంపిన హంతకుడు.. టీ షర్టు సాక్ష్యం?

Crime News: తాజాగా ఒరిస్సా లోని భువనేశ్వర్ లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కునిదాస్‌ సీమాదాస్‌ అనే ఒక యువతి అదే ప్రాంతానికి చెందిన జగన్నాథ్ గౌడ అనే వ్యక్తిని ఎంతో ప్రేమించింది. జీవితాంతం అతనితోనే కలిసి బతకాలని నిర్ణయించుకుంది. ఇక వీలైనంత తొందరగా ప్రియుడిని పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని మొదలు పెట్టాలని భావించింది. ఈ క్రమంలోనే ప్రియుడుని పదేపదే పెళ్లి గురించి ప్రశ్నించేది. కానీ అతను మాత్రం ఇదిగో రేపు అన్నట్టుగా వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో ఆ యువతి అతనిపై మరింత ఒత్తిడిని తీసుకువచ్చింది.

 

దాంతో అతను పెళ్లికి సరే అని ఒప్పుకుని ఇంట్లో నుంచి లేచిపోయి సూరత్ లో పెళ్లి చేసుకుందామని ఆ యువతీకి నచ్చచెప్పాడు. దాంతో ఆమె ప్రేమించిన యువకుడి కోసం తల్లిదండ్రులను కూడా వద్దనుకుని అతనితో కలిసి వెళ్ళింది. ఇక వారిద్దరు కలిసి గుజరాత్ లోని సూరత్ కు వెళ్లారు. అక్కడి నుంచి జగన్నాథ్ ఆమెను ఊరికి దూరంగా తీసుకెళ్లాడు. ఆమె ఎక్కడికి అని ప్రశ్నించగా మొత్తం చూపిస్తాను అని చెప్పి ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాదాపు 49 పోట్లు పొడిచి ఆమెను చంపేశాడు. అక్కడే శవాన్ని పడేసి భువనేశ్వర్‌ వెళ్లిపోయాడు. ఏమీ తెలియనట్లు తన పనిలో తాను మునిగిపోయాడు.

 

కొద్దిరోజుల తర్వాత పోలీసులకు కునిదాస్‌ మృతదేహం దొరికింది. దీని పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులు ఆ యువతిది గుజరాత్ అనుకోని ఆ రాష్ట్రం మొత్తం విచారించగా ఎటువంటి సమాచారం దొరకలేదు. ఈ క్రమంలోనే అక్కడ సీసీ కెమెరాలను పరిశీలించి ఆమె భువనేశ్వర్ కు చెందిన మహిళగా గుర్తించి కునిదాస్‌ సీమాదాస్‌ ప్రియుడు అయిన జగన్నాథను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా అతను విషయాన్ని ఒప్పేసుకున్నాడు.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -