Mahesh: ఆ విషయంలో మహేష్ పై విమర్శలు.. అలా చేయడంతో?

Mahesh: తెలుగు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను నిన్న ఎంతో ఘనంగా ముగిశాయి. హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి. అభిమానుల శోకతప్త హృదయాలు తమ అభిమాన హీరో కృష్ణకు వీడ్కోలు పలికారు. అయితే కృష్ణ అంత్యక్రియల విషయంలో ఆయన కొడుకు, నటుడు మహేష్ బాబు మీద విమర్శలు వినిపిస్తున్నాయి.

 

కృష్ణ అంత్యక్రియల విషయంలో మహేష్ బాబు ఇలా ఎందుకు నిర్ణయించారనే విమర్శలు వస్తున్నాయి. కృష్ణ అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించడం వెనక మహేష్ బాబు నిర్ణయం ఉందని అందరూ గుసగుసలాడుతున్నారు. ఎన్టీఆర్, ఎన్నార్, దగ్గుబాటి రామానాయుడు అంత్యక్రియలను వారి కుటుంబ సభ్యులు నిర్వహించిన తీరుకు భిన్నంగా.. కృష్ణ అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

కృష్ణ నిర్మించిన పద్మాలయ స్టూడియోస్ లోనో లేదంటే కృష్ణకు సంబంధించిన ఏదైనా స్థలంలో అంత్యక్రియలు నిర్వహించి, అక్కడే ఆయన స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే మహేష్ బాబు మాత్రం అలాంటి నిర్ణయాన్ని తీసుకోకుండా.. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నారు

మహేష్ బాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆదిశేషగిరి రావు, రమేష్ బాబు భార్యలు వ్యతిరేకించారని.. అయినా కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కృష్ణ నిర్మించిన పద్మాలయ స్టూడియోలో అపార్ట్ మెంట్లకు స్థలం ఇచ్చినా ఇంకా స్థలం ఉందని, మహేశ్వరంలో కూడా కృష్ణకు స్థలం ఉండగా.. అక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి మహేష్ బాబు ఎందుకు ముందుకు రాలేదనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో సాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -