Surat: తాజాగా గుజరాత్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక కసాయి వ్యక్తి కుటుంబం మొత్తాన్ని కత్తితో దారుణంగా పొడిచి గాయపడేలా చేశాడు. అసలేం జరిగిందంటే.. గుజరాత్లోని సూరత్ జిల్లా కడోదరలో సత్యంనగర్ ప్రాంతంలో రామానుజ్ మహదేవ్ సాహు, రేఖాదేవి 40 ఏళ్ళ వివాహిత కాపురం ఉంటున్నారు. రామానుజ్ స్థానికంగా మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు సూరజ్ 16, ధీరజ్ 14, విశాల్ 12 అనే ముగ్గురు కుమారులు, చాంద్కుమారి అనే 19 ఏళ్ళ కుమార్తె ఉన్నారు.
అయితే వేసవికాలం కావడంతో ఇంట్లో వేడిగా ఉందని పై పడుకుందామని గురువారం రాత్రి రామానుజ్ను అతడి భార్య రేఖాదేవి అడిగింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య గొడవ జరిగింది. భార్యతో గొడవ జరిగిన తర్వాత రామానుజ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత పదునైన కత్తితో తిరిగి వచ్చి చంపేస్తానంటూ రేఖాదేవి పై దాడికి దిగాడు. అదే సమయంలో తల్లిని కాపాడేందుకు కుమార్తె చాంద్ కుమారి అడ్డు వెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన రామానుజ్ కూతురు అని కూడా చూడకుండా అతి దారుణంగా 17 సార్లు పొడిచాడు.
ఆ ఘటనలో చాంద్ కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. ఇక ఆ తర్వాత రేఖాదేవి పై దాడి చేయడానికి వెళుతుండగా ముగ్గురు కుమారులు రక్షించేందుకు ప్రయత్నించగా వారిపై కూడా ఆ దుర్మార్గుడు దాడి చేశాడు. దాంతో ఆ ముగ్గురు యువకులు కూడా గాయపడ్డారు. రేఖాదేవి భయంతో ఇంటి పైకి పరుగులు తీయగా ఆమెను విడిచిపెట్టని రామానుజ్ అక్కడికి కూడా వెళ్లి ఆమెను పొడిచి ఆమెను కూడా గాయపరిచాడు. భార్యాపిల్లలపై దారుణానికి పాల్పడిన నిందితుడు అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వారిని ఇరుగుపొరుగు ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. తన భార్యపై అనుమానంతోనే ఈ దాడికి పాల్పడినట్లు రామానుజ్ పోలీసులకు తెలిపాడు.