Balayya: ఆ ప్రముఖ నటికి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారా?

Balayya: సినిమాల్లో హీరోపాటు అదే స్థాయిలో పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్న హీరొయిన్స్ తక్కువ మందే ఉంటారు. అందులోనూ నెగటివ్ రోల్స్ మెప్పించేవారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు వరలక్ష్మి. ఈమె హీరోయిన్ గా కాకుండా నెగటివ్ క్యారెక్టర్స్ వేస్తూ బాగా పాపులర్ అయ్యింది. తన డైలాగులతో హీరోలకు సమానంగా నిలిచే పాత్రలు వేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఇంతకీ ఈ వరలక్ష్మి ఎవరో కాదు. కోలీవుడ్ స్టార్ హీరో అయిన శరత్ కుమార్ మొదటి భార్య కూతురే ఈ వరలక్ష్మి.

హీరో శరత్ కుమార్ కూతురిగా చెప్పేదానికన్నా జయమ్మ అంటే జనాలు ఆమెను ఇట్టే గుర్తుపట్టగలుగుతారు. ఆమె ఒరిజినల్ పేరు కన్నా సినిమా పేరుతోనే బాగా పాపులారిటీ సంపాదించుకుంది. వరలక్ష్మి సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టినా ఆమెను నెగటివ్ రోల్స్ ఎక్కువగా వరించాయి. ఆమె బాడీ, ఫిజిక్ కు అందరూ ఆమెకు నెగటివ్ రోల్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో వరలక్ష్మి అటువంటి పాత్రలనే చేస్తూ నాలుగు డబ్బులు వెనకేసుకుంటోంది.

రవితేజ హీరోగా చేసిన క్రాక్ సినిమాలో వరలక్ష్మీ నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో బాలయ్య వీరసింహారెడ్డి అనే సినిమా చేస్తున్నారు. ఇందులో కూడా వరలక్ష్మి కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా మాత్రమే కాదు ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న సినిమాలో కూడా ఆమె నటించనుంది.

అటు తమిళం, ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలలో మంచి పాత్రలు చేస్తూ వరలక్ష్మీ బిజీగా ఉంటోంది. వీరనరసింహారెడ్డి సినిమా ద్వారా బాలయ్యతో వరలక్ష్మికి మంచి బాండింగ్ కుదిరిందనే అనిపిస్తోంది. అందుకే బాలయ్య ఆమెకు మరో సినిమాలో కూడా చేయాలని ఆదేశించారు. అనిల్ రావిపూడి సినిమాలో వరలక్ష్మిని కీ రోల్ చేయాలని బాలయ్య చెప్పాడట. అయితే తనకు కాల్ షీట్స్ ఫుల్ అయిపోయాయని వరలక్ష్మి చెప్పడంతో బాలయ్య ఫైర్ అయ్యాడట. ముందు నా సినిమానే అని, ఆ తర్వాతే ఇంకెవరి సినిమా అని బాలయ్య చెప్పాడట. అంతేకాదు తన సినిమా చేయకపోతే బండి తీస్తా తెలుసు కదా అని బాలయ్య ఫన్నీగా వరలక్ష్మితో మాట్లాడట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. బాలయ్య లాంటి హీరోతో వరలక్ష్మి ఇలా ఫన్నీగా ఉండటం నిజంగా గ్రేట్ అని నందమూరి ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: చంద్రబాబు దూకుడు మామూలుగా లేదుగా.. రోజుకు మూడు సభలతో అలా ప్లాన్ చేశారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న పలమనేరులో ప్రజా గళం పేరిట ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -