Waltair Veerayya: టాలీవుడ్ లో పెద్ద హీరోలుగా ఉన్న నందమూరి బాలయ్య మరియు మెగాస్టార్ చిరంజీవిలు బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు. సంక్రాంతి బరిలో నువ్వా నేనా అన్నట్లు తలపడిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు.. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లు మనల్ని అలరిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలకు పాజిటివ్ టాక్ రాగా.. మంచి కలెక్షన్లను రాబడుతున్నాయి.
మరి ఈ రెండు సినిమాల్లో సంక్రాంతి బరిలో విజేత ఎవరు అనే ప్రశ్న తలెత్తితే మాత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమానే అని చెప్పవచ్చు. ఎందుకంటే బాలయ్య సినిమా విడుదలైన ఒక రోజు తర్వాత ఈ సినిమా విడుదలైనా.. భారీగా స్క్రీన్లను సొంతం చేసుకోవడంతో పాటు అతి వేగంగా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. అటు బాలయ్య సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం వెనకబడింది.
సంక్రాంతిని టార్గెట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను చేయగా.. చిరు ఊహించినట్లే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్లు రాబట్టి.. మరోసారి టాలీవుడ్ కు మెగాస్టార్ స్టామినాను చూపించింది. చాలాకాలం తర్వాత మెగాస్టార్ ఈ స్థాయి హిట్ ను అందుకోగా.. సంక్రాంతి బరిలో విజేతగా ‘వాల్తేరు వీరయ్య’ను ప్రేక్షకులు గెలిపించారు.
కలెక్షన్లతో దూసుకుపోతున్న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ అవడానికి సీక్రెట్ ఏంటో ముందే చిరంజీవి తెలుసుకున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అని, ఇందులో అది పూర్తిస్థాయిలో ఉందని చిరంజీవి నమ్ముకోవడంతోనే ఈ సినిమా సంక్రాంతి బరిలో విజేతగా నిలవడంతో పాటు చిరంజీవికి కెరీర్ కు మంచి ప్లస్ పాయింట్ అయింది.