Nagababu: కుటుంబ పరువు తీసిందని నాగబాబు అలా చేశారా.. ఏం జరిగిందంటే?

Nagababu: నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి తో ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యాడు. మిస్టర్, అంతరిక్షం సినిమాలలో కలిసి వీరిద్దరూ నటించిన సంగతి తెలిసిందే. ఆ పరిచయమే ప్రేమకు దారి తీసింది. ఇప్పుడు ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు ఈ జంట. నవంబర్ లేదా డిసెంబర్లో వీరి పెళ్లి జరగవచ్చు అని జోరుగా ప్రచారం సాగుతుంది.

నిజానికి ఈ పెళ్లి గతేడాదే జరగవలసింది కానీ ఈ పెళ్ళికి లావణ్య అభ్యంతరం చెప్పిందట. అందుకు కారణం మెగా డాటర్ నిహారిక అంట. ఒడిదుడుకలలో ఉన్న నిహారిక కాపురం చక్కబడిన తరువాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. నిహారిక పెళ్లిలో లావణ్య చేసిన హడావుడి మనమందరం చూసిందే.

 

మొదలు నుంచి ఆఖరి వరకు నిహారిక దగ్గరే ఉండి అంతా తానే నడిపించింది లావణ్య. అలాంటి నిహారిక జీవితం ఒడిదుడుకల్లో ఉంది అంటే భరించలేకపోయింది లావణ్య. నిహారిక జీవితాన్ని చక్కబెట్టిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అనే నిర్ణయానికి రావడం కారణం అదేనంట. కానీ ఆ సమస్య ఒక కొలిక్కి రాదని అభిప్రాయానికి వచ్చారు ఏమో ఈ జంట అందుకే పెళ్లికి సిద్ధమయ్యారని సమాచారం. అయితే ఈ పెళ్లికి మెగా డాటర్ నిహారిక దూరంగా ఉండనున్నట్లు సమాచారం.

 

కుటుంబం పరువు తీసిందని కూతురు మీద నాగబాబు అలా చేశారా.. అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అందుకు కారణం నిహారిక ఈ మధ్యకాలంలో అటు మెగా కుటుంబాన్ని గాని ఇటు నాగబాబు కుటుంబాన్ని గాని కలిసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఈమె ఒక్కతే మణికొండలో నివాసం ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. నిహారిక వస్తే భర్త చైతన్యతోనే రావాలి అని నాగబాబు గట్టి కండిషన్ పెట్టినట్లు కూడా వార్తలు ప్రచారం అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -