Naresh-Pavitra Lokesh: నరేష్ పవిత్ర అక్కడికి హనీమూన్ కు వెళ్లారా.. ఏం జరిగిందంటే?

Naresh-Pavitra Lokesh: నటుడు నరేష్,నటి పవిత్ర లోకేష్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జంట పేర్లు మారుమోగిపోతున్నాయి. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. గత కొంతకాలంగా నరేష్ పవిత్ర లు సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలె ఏడాది మొదట్లో లిప్ లాక్ పెట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటిగా పోతున్నాము అని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఊహించిన విధంగా అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

 

ఎటువంటి హంగామా లేకుండా రహస్యంగా పెళ్లి చేసుకొని ఒక్కసారిగా షాక్ ఇచ్చారు నరేష్. తర్వాత అదే విషయాన్ని నరేష్ తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇదేం పోయేకాలం, ఈ వయసులో మీకు పెళ్లి అవసరమా అంటూ దారుణంగా నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా నరేష్ షేర్ చేసిన ఆ పెళ్లి వీడియో కొద్ది రోజుల క్రితంది అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ జనతా ప్రస్తుతం దుబాయిలో హనీమూన్ జరుపుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్లి జరిగిన విషయాన్ని దాచిపెట్టిన నరేష్ దుబాయ్ కి వెళ్లి అనంతరం అక్కడి నుంచి తన పెళ్లికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఈ వయసులో పెళ్లి చేసుకోవడమే ఒక దిక్కుమాలిన పని, మళ్లీ హనీమూన్ కూడానా,అసలు మీకు సిగ్గుందా అంటూ నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నరేష్ పెళ్లి వార్తలపై అతని భార్య రమ్య రఘుపతి ఏ విధంగా స్పందిస్తుంది అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -