Overseas: ఓవర్సీస్ లో ఆ హీరోనే పైచేయి సాధించారా?

Overseas: ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. అందులోనూ రెండు భారీ బిగ్ బడ్జెట్ మాస్ కమర్షియల్ సినిమాలు పోటీ పడనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాలు కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉండనుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ రెండు సినిమాలకు మంచి డిమాండ్ ఉండటంతో పాటు పోటీ కూడా ఎక్కువగా ఉండనుంది. ఇలాంటి సమయంలో ఇక ఓవర్సీస్ లో ఏ సినిమా ఎక్కువ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతోందనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

 

ఈ సంక్రాంతికి జనవరి 12వ తేదీన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో ముందుకు వస్తున్నాడు. అలాగే జనవరి 13వ తేదిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు కూడా ఓవర్సీలో వాటి రిలీజ్ డేట్ కంటే ముందుగా ప్రీమియర్స్ ద్వారా సందడి చేయబోతున్నాయి.

 

రెండు వారాల కంటే ముందుగానే ఓవర్సీస్ లో ఈ సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యింది. దీంతో ఇప్పటినుంచి ఫ్యాన్స్ టికెట్లు కొనేందుకు పోటీపడ్డారు. ఇక తాాజా సమాచారం ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎవరు దూకుడుగా ఉన్నారనే వివరాలు ముందుగానే చాలా లొకేషన్లలో నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకు ఎక్కువ స్థాయిలో బుకింగ్స్ అందుకున్నట్లు సమాచారం.

 

అయితే ముందుగానే వాల్తేరు వీరయ్య సినిమా 57 లొకేషన్స్ లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైంది. దీంతో ఆ సినిమా ఇప్పటివరకు 28 వేల డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అందుకోగా ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ 64 లొకేషన్స్ లో ప్రారంభమయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆ సినిమా 43 వేల డాలర్స్ పొందింది. మరి మొత్తంగా ఓవర్సీలో ఏ హీరో సినిమా ముందు నిలుస్తుందో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -